Home » Arvind Kejriwal
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీ అరెస్టుపై ఆయన భార్య సునీత కేజ్రీవాల్ కీలక విషయాలు వెల్లడించారు. ఇందుకు బంధించిన వీడియోను ఆమె శనివారంనాడు విడుదల చేశారు. ఎన్డీయే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి తప్పుడు వాంగ్మూలం ఆధారంగానే లిక్కర్ కేసులో కేజ్రీవాల్ను ఈడీ అరెస్టు చేసిందని ఆ వీడియోలో ఆమె ఆరోపించారు.
ఎక్సైజ్ పాలసీ స్కామ్కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు జూలై 12వ తేదీ వరకు బుధవారంనాడు పొడిగించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) సీఎం అరవింద్ కేజ్రీవాల్కు 3 రోజుల సీబీఐ కస్టడీ శనివారం పూర్తయింది. కస్టడీ ముగియడంతో సీబీఐ అధికారులు.. కేజ్రీవాల్ను(Arvind Kejriwal) కోర్టులో హాజరు పరిచారు.
ప్రజా సమస్యలపై ప్రతిపక్షాలు వినూత్నంగా నిరసన తెలపడం సహజమే. తాజాగా ఢిల్లీకి చెందిన ఓ బీజేపీ(BJP) నేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. గత రెండు రోజులుగా దేశ రాజధానికి వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీంతో రోడ్లపై మోకాళ్ల ఎత్తులో వర్షపు నీరు నిలిచింది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీ లాండరింగ్ వ్యవహారంలో ఆప్ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన భార్య సునీత కేజ్రీవాల్ బుధవారం ఎక్స్ వేదికగా స్పందించారు.
ఎక్సైజ్ పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు చుక్కెదురైంది. మూడు రోజుల సీబీఐ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు బుధవారంనాడు ఆదేశించింది. మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ ఇంతకుముందే కేజ్రీవాల్ను అధికారికంగా అరెస్టు చేసింది.
లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) బెయిల్పై ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్కు(CM Arvind Kejriwal) ఊరట దక్కలేని విషయం విదితమే. కేజ్రీవాల్ పిటిషన్ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్తో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం వెల్లడించింది.
తన బెయిల్పై డిల్లీ హైకోర్టు ఆదేశాలను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఆప్ కన్వీనర్, సీఎం కేజ్రీవాల్కు ఊరట మాత్రం దక్కలేదు. కేజ్రీవాల్ పిటిషన్ను జూన్ 26వ తేదీన విచారిస్తామని జస్టిస్ మనోజ్ మిశ్రా, జస్టిస్ ఎస్వీఎన్ భట్తో కూడిన వెకేషన్ బెంచ్ సోమవారం వెల్లడించింది.
లిక్కర్ స్కాం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) ఆదివారం సుప్రీం కోర్టు(Supreme Court) తలుపుతట్టారు. లిక్కర్ కేసులో(Delhi Liquor Scam) ఆయనకు ఇటీవలే రౌస్ ఎవెన్యూ కోర్టు బెయిల్ ఇచ్చిన విషయం విదితమే.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య పరిస్థితిపై ఆప్ ఆందోళన వ్యక్తం చేసింది. లిక్కర్ స్కామ్లో అరెస్టైనప్పటి నుంచి భారీగా బరువు తగ్గారని అంటోంది. మూడు నెలలో 8 కిలోల బరువు తగ్గారని వివరించింది.