Home » Arvind Kejriwal
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(arvind kejriwal) వేసిన రెండు పిటిషన్లపై సుప్రీంకోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. సీబీఐ నమోదు చేసిన అవినీతి కేసులో తన అరెస్టు, బెయిల్ నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ రెండు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు.
ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో(Delhi Liquor Scam) ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) జ్యుడీషియల్ కస్టడీని సెప్టెంబర్ 25 వరకు పొడగిస్తూ రౌస్ అవెన్యూ కోర్టు నిర్ణయించింది.
పెరుగుతున్న వాయు కాలుష్యం(Air Pollution) దేశంలోని అభివద్ధి చెందుతున్న నగరాలు, పట్టణాలకు సవాలు విసురుతోంది. ఏటా వాయుకాలుష్యం బారిన పడి వేల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతున్నారు.
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో(Delhi Liquor Scam) సీఎం అరవింద్ కేజీవాల్(Arvind Kejriwal) బెయిల్ పిటిషన్తో పాటు అరెస్టును సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్పై గురువారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.
ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్పై దాడి కేసులో అరెస్టయిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహాయకుడు బిభవ్ కుమార్కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ అంశంపై ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ మంగళవారం స్పందించారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు (Delhi Liquor Scam Case).. దేశ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఢిల్లీ మొదలుకుని గల్లీ వరకూ ఎన్ని అరెస్టులు జరిగాయో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఇలా పెద్ద తలకాయలు అరెస్ట్ కావడంతో ఒక్కసారిగా దేశ రాజకీయాలు హీటెక్కాయి..
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన కలలో కనిపించి.. రామ్ చందర్ వెళ్లి పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, గోపాల్ రాయ్, సందీప్ పాఠక్లతోపాటు ఇతర నేతలను కలువు. అలాగే మీ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలను కలువు. వారితో కలిసి పని చేయాలని తనను మందలించారన్నారు.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సిబీఐ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎలాంటి ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారంనాడు పొడిగించారు.
సీబీఐ నమోదు చేసిన ఎక్సైజ్ పాలసీ కేసులో బెయిలు కోసం ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సెప్టెంబర్ 5వ తేదీకి సుప్రీంకోర్టు శుక్రవారం వాయిదా వేసింది. దీంతో బెయిల్ కోసం కేజ్రీవాల్ మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి ఎదురైంది.
కర్ణాటక గవర్నర్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రస్తుతం ఆ రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతోంది. మైసూరు నగర అభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) కుంభకోణంపై విచారణకు గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్ ఆమోదం తెలపడంతో సిద్ధరామయ్య అరెస్ట్ అవుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది.