Home » Arvind Kejriwal
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రకటనపై సామాజిక కార్యకర్త అన్నా హజారే స్పందించారు. ఆదివారం మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్దిలో అన్నా హజారే విలేకర్లతో మాట్లాడారు. రాజకీయాల్లోకి వెళ్లవద్దని కేజ్రీవాల్ను హెచ్చరించానని గుర్తు చేసుకున్నారు.
దాదాపు ఆరు నెలల తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఆదివారంనాడు జరిపిన పార్టీ సమావేశంలో తన రాజీనామాపై కీలక ప్రకటన చేశారు. రెండు రోజుల తర్వాత సీఎం పదవికి తాను రాజీనామా చేస్తున్నానని, మళ్లీ ప్రజలు తీర్పు ఇచ్చేవరకూ ఆ కుర్చీలో కూర్చోనని చెప్పారు.
ఇండియా కూటమిలోని రెండు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, ఆప్లు హోరాహోరీ తలపడతాయా? ఆప్తో పొత్తు ఇకముందూ కొనసాగుతుందా? అనే ప్రశ్నలకు కాంగ్రెస్ నేతలు క్లారిటీ ఇచ్చారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. దీంతో ఆయన వారసులు ఎవరే ఓ చర్చ అయితే వాడి వేడిగా సాగుంది. అలాంటి వేళ ఢిల్లీ మంత్రి అతిషి పేరు కేజ్రీవాల్ వారసురాలిగా తెరపైకి వస్తుంది.
ముఖ్యమంత్రి పదవికి మరో రెండు రోజుల్లో రాజీనామా చేస్తానని అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం దేశ రాజధానిలో సంచలనం సృష్టించింది.
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్టై జైలు నుంచి బయటకు వచ్చిన కేజ్రీవాల్.. తాజాగా సంచలన ప్రకటన చేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయనున్నట్లు ప్రకటించారు.
లిక్కర్ స్కామ్ కేసులో సుమారు అయిదున్నర నేలల పాటు జైలులో ఉన్న కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు పలు షరతులతో శుక్రవారంనాడు బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆప్ కార్యకర్తల సంబరాల మధ్య తీహార్ జైలు నుంచి సాయంత్రం ఆయన విడుదలయ్యారు. కార్యకర్తలకు అభివాదాలు తెలుపుతూనే తన స్పందన తెలియజేశారు.
లిక్కర్ స్కాం కేసులో కొంతకాలంగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(Arvind Kejriwal) శుక్రవారం సాయంత్రం తిహార్ జైలు(Tihar Jail) నుంచి విడుదలయ్యారు.
ఢిల్లీ మద్యం కుంభకోణం మనీ లాండరింగ్ వ్యవహారంలో అరెస్టయిన సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు శుక్రవారం షరతులతో కూడిన బెయిలు మంజూరు చేసింది. అసలు సీఎం కేజ్రీవాల్కు ఈ కేసులో ఈడీ తొలుత ఎప్పుడు సమన్లు జారీ చేసింది.. ఎప్పుడు అరెస్ట్ చేసింది.. ఎప్పుడు బెయిల్ పై విడుదలయ్యారంటే..
ఆరు నెలల అనంతరం ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆమ్ ఆద్మీ పార్టీ నేతల్లో ఆనందం వెల్లువిరిసింది. ఈ సందర్భంగా పార్టీ శ్రేణులు ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. మిఠాయిలు పంచుకున్నారు.