Home » Article 370 Abrogation
బుజ్జగింపు రాజకీయాలకు కాంగ్రెస్ పార్టీ కేరాఫ్గా నిలిచిందని ప్రధాని మోదీ(PM Modi) తీవ్ర విమర్శలు చేశారు. జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్లో జరిగిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు.
జమ్మూ కశ్మీర్లో ఆర్టికల్ 370ని రద్దు చేసే ధైర్యం కాంగ్రెస్కు ఉందా అని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా(Amit Shah) ప్రశ్నించారు. మధ్యప్రదేశ్లో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టికల్ 370ని మార్చడానికి ధైర్యం చేయవద్దని కాంగ్రెస్ను హెచ్చరించారు.
ప్రధాని నరేంద్ర మోదీ బిజీగా ఉన్నారు. వివిధ రాష్ట్రాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో క్షణం తీరకలేకుండా గడుపుతున్నారు. జమ్ముకశ్మీర్ రాష్ట్రంలో ప్రధాని మోదీ ఈ రోజు పర్యటిస్తారు. ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి కశ్మీర్ వెళ్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. శ్రీనగర్లో రూ.6400 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారు.
జమ్మూకశ్మీర్ కు స్వయం ప్రతిపత్రి కల్పించే 370వ అధికరణను కేంద్రం రద్దు చేయడాన్ని సుప్రీంకోర్టు సమర్ధిస్తూ ఇటీవల ఇచ్చిన చరిత్రాత్మక తీర్పుపై జమ్మూకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీ నిశిత విమర్శ చేశారు. సుప్రీంకోర్టు నిర్ణయం దేవుడి తీర్పేమీ కాదని అన్నారు.
జమ్ముకశ్మీర్కి ప్రత్యేక ప్రతిపత్తి కలిగించే ‘ఆర్టికల్ 370’ని రద్దు చేయాలని నాలుగేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజ్యాంగబద్ధమేనని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. అలాగే.. లద్దాఖ్ను కేంద్ర పాలిత ప్రాంతం (యూటీ)గా
నాలుగు సంవత్సరాల క్రితం ‘ఆర్టికల్ 370’ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్వాగతించారు. సుప్రీం తీర్పు తర్వాత కూడా ఆర్టికల్ 370 శాశ్వతమైనదేనని ఎవరైనా చెప్తే..
ఆర్టికల్ 370 రద్దుని సమర్థిస్తూ దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన చరిత్రాత్మకమైన తీర్పుపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించారు. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్ ప్రజల ఐక్యత, పురోగమనం, దృఢవిశ్వాసం కోసం సుప్రీంకోర్టు సుస్పష్టమైన ప్రకటన చేసిందని వ్యాఖ్యానించారు.
ఆర్టికల్ 370 రద్దుపై సుప్రీంకోర్టు తీర్పు విచారకరంగా ఉందని, దురదృష్టకరమని డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ ఆజాద్ పార్టీ ఛైర్మన్ గులాం నబీ ఆజాద్ అన్నారు. కోర్టు తీర్పుతో ప్రజలు సంతోషంగా లేరని పేర్కొన్నారు.