Home » APSRTC
ఏపీఎస్ ఆర్టీసీని తిరిగి లాభాల బాటలోకి తీసుకువెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణ తెలిపారు. ఇందుకు ఆర్టీసీ జోనల్ ఛైర్మన్లు, అధికారులతో కలిసి కార్యాచరణ రూపొందించినట్లు కొనకళ్ల వెల్లడించారు. ముందుగా దెబ్బతిన్న బస్టాండ్లలో అభివృద్ధి పనులు చేపడతామని ఆయన చెప్పారు.
పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్కు ఆర్టీసీ స్టాఫ్ వర్కర్స్ ఫెడరేషన్ (APPTD) ప్రతినిధులు లేఖ రాశారు. రామగిరిలో గతంలో ఉన్న విండ్ ఎనర్సి ప్రాజెక్టుకు సంబంధించిన సుమారు 300 ఎకరాల స్థలాన్ని అతి తక్కువ లీజుతో SECI (సోలార్ ఎనర్జీ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా) పేరుతో అదానికి లీజుకు ఇచ్చారని చెప్పారు.
వైఎస్ఆర్ జిల్లా పులివెందుల సమీపంలో అదుపుతప్పిన ఏపీఎస్ఆర్టీసీ బస్సు ప్రమాదవశాత్తూ 30అడుగుల లోయలో పడింది. ఈ ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయాణికులకు తీవ్రగాయాలు కాగా.. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
కదిరి ఆర్టీసీ డి పోను జిల్లా ప్రజారవాణాధికారి మధుసూదన ఆదివారం సందర్శించారు. బస్టాండ్లో ప్రయాణికులకు వసతిసౌకర్యాలు, తాగునీరు, కూర్చీలు, ఫ్యాన్లు, పరిశుభ్రతను పరిశీలించారు
ఆర్టీసీ ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించి మెరుగైన వైద్య సేవలందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆర్టీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన కొనకళ్ల నారాయణరావు అన్నారు.
దసరాకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రయాణికులకు ఏపీఎ్సఆర్టీసీ శుభవార్త చెప్పింది. తిరుమల వేంకటేశ్వరుడి బ్రహ్మోత్సవాలు, బెజవాడ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు, విద్యాసంస్థలకు దసరా సెలవుల నేపథ్యంలో రద్దీని దృష్టిలో పెట్టుకొని 6,100 ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసినట్లు సోమవారం తెలిపింది.
అక్టోబర్ 1 నుంచి టికెట్లు బుక్ చేసుకుంటే డబుల్ ఛార్జీలు చెల్లించాల్సిందే. ఇప్పటివరకు హైదరాబాద్ నుంచి విశాఖపట్టణానికి నాన్ ఏసీ బస్సులో రూ.1000కి టికెట్ లభిస్తే.. రేపు అదే బస్సులో టికెట్ రూ.1500 నుంచి రూ.2000కు పెరగనుంది. అక్టోబర్ 4,5,6 తేదీల్లో ఈ టికెట్ ధరలు..
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తనకు సముచిత స్థానం కల్పించారని ఆ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ పేర్కొన్నారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కొనకళ్ల నారాయణరావును సీఎం చంద్రబాబు నియమించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణరావు స్పందించారు.
గుర్రంకొండ పట్టణం నుంచి మదనపల్లె, అంగళ్లు, వాల్మీకీపురం పట్టణాల్లో పాఠశాలలు, కళాశాల్లో చదివే విద్యార్థిని, విద్యార్థులు సమయానికి సకాలంలో బస్సులు లేక పడరా నిపాట్లు పడుతున్నారు.
తంబ ళ్లపల్లె నియోజకవర్గానికి ఆర్టీసీ డిపో ను కేటాయించాలని రాష్ట్ర రవానా, యువజన, క్రీడా శాఖమంత్రి మండి పల్లి రాంప్రసాద్రెడ్డిని నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రా రెడ్డి కోరారు.