Home » APSRTC
ఆర్టీసీ యాజమాన్యం అవినీతి చేస్తున్న విజిలెన్స్ అధికారులపై చర్యలు తీసుకుంది. కడప, విజయవాడ జోన్లలో అవినీతి ఆరోపణలపై విచారణ ప్రారంభించి పలువురు అధికారులను సస్పెండ్ చేశారు.
ఆర్టీసీలో పదోన్నతుల కోసం ఆరేళ్లుగా ఎదురుచూస్తున్న సిబ్బందికి ఇప్పటికీ న్యాయం జరగలేదు. అధికారులకు డబ్బులిచ్చి పదోన్నతులు పొందినా, సిబ్బందిని నిర్లక్ష్యం చేయడంపై వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు
ఏపీఎస్ ఆర్టీసీలో సిబ్బంది, ఉద్యోగులు, అధికారులు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారు, చిన్న పొరపాట్లకే కఠిన శిక్షలు ఎదుర్కొంటున్నారు. బోర్డు సభ్యులు ఆరు నెలలైనా సమావేశం కాని పరిస్థితి పట్ల అసంతృప్తితో ఉన్నారు
ఏపీఎస్ఆర్టీసీ క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ (సీసీఎస్)కి సంబంధించిన 4 కోట్ల రూపాయల ఫ్లాట్ కొనుగోలు ప్రకటన తీవ్ర చర్చలకు దారి తీసింది. దీనిపై పాలకమండలి వివరణ ఇచ్చి, ఎలాంటివైన విచారణకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఏపీఎస్ఆర్టీసీ ప్రధాన కార్యాలయం ఆర్టీసీ హౌస్లో జరుగుతున్న చర్చ ఇది. క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీ(సీసీఎస్) కార్యాలయం ప్రస్తుతం విజయవాడ బస్టాండు ప్రాంగణంలోని ఆర్టీసీ హౌస్లో ఉంది. రూపాయి కూడా అద్దె చెల్లించాల్సిన అవసరం లేదు.
డ్రైవర్ సెల్ఫోన్లో మాట్లాడుతూ నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడమే ప్రమాదానికి కారణమని బస్సులోని ప్రయాణికులు ఆరోపించారు. కడప జిల్లా జమ్మలమడుగు డిపోకు చెందిన ఏపీ 39 యూవీ 4299 నంబరు గల...
ఆర్టీసీ ఎండీగా ఉన్న ద్వారకా తిరుమలరావుకే పబ్లిక్ ట్రాన్స్పోర్టు డిపార్ట్మెంట్ (పీటీడీ) కమిషనర్ పదవిని అప్పగిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఏపీఎస్ఆర్టీసీలో ఉద్యోగం చేస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు కారుణ్య నియామకం కింద ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించింది.
AP Govt: ఏపీఎస్ ఆర్టీసీ బోర్డును నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్టీసీ చైర్మన్గా మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ, వైస్ చైర్మన్గా పీ.యస్. మునిరత్నంలతోపాటు డైరెక్టర్లుగా రెడ్డి అప్పలనాయుడు, సురేష్ రెడ్డి, పూలా నాగరాజులను నియమించారు. అలాగే రవాణా, ఆర్ధిక, జీఏడీ, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఎపీయస్ ఆర్డీసీ ఎండీ, ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్, ఫైనాన్షియల్ అడ్వయిజర్, కేంద్ర ప్రభుత్వ రోడ్ సేఫ్టీ డైరెక్టర్, ట్రాన్స్పోర్టు డైరెక్టర్లతోపాటు కేంద్ర ప్రభుత్వ పట్టణాభివృద్ది శాఖ డైరెక్టర్లను సభ్యులుగా ప్రభుత్వం నియమించింది.
Maha Kumbh Mela: Maha Kumbh Mela: మీ సొంత ఊరు నుంచే మహాకుంభ మేళకు వేళ్లేందుకు తెలుగు రాష్ట్రాల్లోని ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేస్తోంది. అలా వెళ్లాలనుకొంటే.. దాదాపు 40 నుంచి 50 మంది ప్రయాణికులు ఉండాల్సి ఉంది.