Home » Apollo Hospital
అపోలో హాస్పిటల్స్కు భారీ ఊరట లభించింది. ఈ ఆస్పత్రులపై ఉన్న ఫెమా ఉల్లంఘనల కేసును ఈడీ క్లోజ్ చేసింది. దీంతో ఆర్బీఐ కాంపౌండింగ్ ప్రక్రియ ముగిసింది.
జీవనశైలిలో మార్పుల వల్లే రోజురోజుకూ క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోందని హైదరాబాద్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్యుడు పాల్కొండ విజయ్...
రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్కు ఆంజియోగ్రామ్ పరీక్షలు నిర్వహించారు. అందులో గుండె పనితీరుకు సంబంధించిన ఫలితాలు అన్నీ సవ్యంగా ఉన్నట్లు అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రకటించింది. ఈ నెల 21న స్టాలిన్ వాకింగ్ చేస్తున్నప్పుడు స్వల్ప అస్వస్థతకు గురై అపోలో ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే.
కాలేయ సంరక్షణలో ఆధునిక ఆవిష్కరణల కోసం అపోలో హాస్పిటల్స్తో సీమెన్స్ హెల్తినీర్స్ జట్టు కట్టింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని అపోలో చైర్మన్ డాక్టర్ ప్రతాప్ చంద్రారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ వచ్చిన ఏపీ సీఎంతో ఆదివారం ఆయన భేటీ అయ్యా రు.
అపోలో హాస్పిటల్స్ 2024-25 ఆర్థిక సంవత్సరంలో 8,000 కోట్ల పెట్టుబడులతో 4,300 కొత్త పడకలను ఏర్పాటు చేయాలని ప్రకటించింది. క్యూ4 లో రూ.390 కోట్లు నికర లాభం నమోదు చేసిన ఈ సంస్థ, ఏడాది మొత్తానికి రూ.1,446 కోట్ల లాభాన్ని సాధించింది.
ప్రముఖ హెల్త్కేర్ సంస్థ అపోలో హాస్పిటల్స్ ఎంటర్ప్రైజ్ లిమిటెడ్ మార్చి 31, 2025తో ముగిసిన నాలుగో త్రైమాసికానికి (Q4 FY25) పటిష్టమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది.
ప్రపంచ రక్తపోటు దినోత్సవం సందర్భంగా అపోలో ఆసుపత్రులు దేశంలో పెరుగుతున్న రక్తపోటు సమస్యపై దృష్టి సారించాయి. దాదాపు 30 శాతం మంది భారతీయ వయోజనులు అధిక రక్తపోటుతో బాధపడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశాయి.
రోగుల పట్ల అంకితభావంతో సేవలందిస్తున్న నర్సులను అపోలో హాస్పిటల్స్ గౌరవించింది. వారి సేవలు ఎంతో విలువైనవని ప్రశంసించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఆసుపత్రి ప్రాంగణం కృతజ్ఞతాభావంతో నిండిపోయింది.
అరుదైన శస్త్ర చికిత్స నిర్వహించి అపోలో అరుదైన ఘనత సాధించింది. ప్రమాదంలో గాయపడి, తీవ్రమైన భుజం నొప్పితో బల హీనంగా మారిన వ్యక్తి ఎడమ చెయ్యికి అపోలో ఆస్పత్రి వైద్యులు సర్జరీని నిర్వహించారు.