Home » AP Volunteers
వలంటీర్లంతా రాజీనామా చేయాలని వైసీపీ (YSRCP) నేతలు ఒత్తిడి చేస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నేత పులివర్తి సుధారెడ్డి (Pulivarthi Sudhareddy) అన్నారు. శనివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడుతూ... చంద్రగిరిలో వలంటీర్లపై వైసీపీ నేతలు ఒత్తిడి చేస్తున్నారని.. దీంతో వారిపై తీవ్ర ఒత్తిడి పెరిగిందన్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో వలంటీర్లు వైసీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు ఇచ్చారని మిగిలిన వారిని పట్టించుకోలేదని అన్నారు.
కాకినాడలోని నాగమల్లితోట జం క్షన్ సమీపంలో గురువారం వైసీపీకి చెందిన గుత్తుల సూర్యప్రకాశ్ వలంటీర్లతో సమావేశ మైనట్టు వచ్చిన సమాచారంతో కాకినాడ రూరల్ జనసేన అభ్యర్థి పంతం నానాజీ కార్యకర్తలతో కలసి వెళ్లి వలంటీర్లను నిలదీశారు.
09: ఉగాది పండగ వేళ రాష్ట్రంలోని వలంటీర్లకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు బంఫర్ ఆఫర్ ప్రకటించారు. తాము అధికారంలోకి వస్తే.. వలంటీర్ల జీతం నెలకు రూ. 10 వేలకు పెంచుతామన్నారు. ప్రజలకు సేవ చేసే వలంటీర్లకు తాము ఎల్లప్పుడు అండగా ఉంటామని స్పష్టం చేశారు.
Andhrapradesh: ఏపీలో పింఛన్దారులకు నగదు పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలంటూకేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ అంశాన్ని వైసీపీ తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. వాలంటీర్లను విధుల నుంచి పక్కన పెట్టేయడంతో వారితో రాజీనామాలు చేయించాలనే కొత్త నాటకానికి వైసీపీ తెర తీసింది. అందులో భాగంగానే అనేక ప్రాంతాల్లో వాలంటీర్లు మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్న పరిస్థితి.
వలంటీర్ల(Volunteers) విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని.. వారికి ఎలాంటి అన్యాయం జరగదని తెలుగుదేశం (Telugu Desham Party) పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (Nara Chandrababu Naidu) అన్నారు. వలంటీర్లను ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాలకు వాడుతున్న కారణంగా వారిని కేంద్ర ఎన్నికల సంఘం విధులకు దూరం పెట్టిందని తెలిపారు.
ఏపీలో ప్రజాస్వామ్యం విషమ పరిస్థితుల్లో ఉందని మాజీ ఎస్ఈసీ, సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh Kumar) అన్నారు. శనివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి ఉప ఎన్నికల్లో 35 వేల దొంగ ఓట్లు వేశారని చెప్పారు.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఎన్నికల విధుల్లో వలంటీర్లను దూరంగా ఉంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఏపీ ప్రభుత్వం కీలక ఉత్వర్తులు జారీ చేసింది. వలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా ఉంచాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండటంతో అధికార వైసీపీ (YSRCP) పలు కుయుక్తులకు పాల్పడుతోంది. ఈసారి కూడా ఎలాగైనా అధికారంలోకి రావాలని భావించిన సీఎం జగన్రెడ్డి (CM Jagan) పలు అక్రమాలకు పాల్పడుతున్నారు. వలంటీర్ల(Volunteers)తో ప్రజలను మభ్యపెట్టేందుకు మరో కుట్రకు తెరలేపారు.
వలంటీర్ మోసం చేసి ఓ డ్వాక్రా మహిళ బీమా సొమ్మును చాలా తెలివిగా కాజేసింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలంలోని కనపర్తిలో చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చాట్ల నాగేంద్రం డ్వాక్రా గ్రూపు సభ్యురాలు. ఆమెకు భర్తతో సంబంధం లేకపోవటంతో కనపర్తిలోనే తల్లిదండ్రుల దగ్గర ఉంటున్నారు.