• Home » AP Secretariat Employees Association

AP Secretariat Employees Association

Harish Rao: కాంగ్రెస్‌ హామీల అమలేది?

Harish Rao: కాంగ్రెస్‌ హామీల అమలేది?

రైతులకు కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు నెరవేరడం లేదని మాజీ మంత్రి హరీష్‌రావు విమర్శించారు. ఆయన మాట్లాడుతూ, రేవంత్‌రెడ్డి జనవరి 26న, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కూడా మార్చి 31 నాటికి రైతులందరికీ భరోసా డబ్బులు అందిస్తామని ప్రకటించినప్పటికీ, అది అమలు కాలేదని ఆరోపించారు. రాయితీల విషయంలో అబద్ధాలు చెప్పడం, మాటలు మడతేయడం రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని ఆయన పేర్కొన్నారు.

ఇక.. ఆర్‌అండ్‌బీ వంతు!

ఇక.. ఆర్‌అండ్‌బీ వంతు!

నిన్న విజయవాడ మున్సిపల్‌ కమిషనర్‌ బంగ్లా, డీఆర్‌ఆర్‌ ఇండోర్‌ స్టేడియాలను అటాచ్‌ చేస్తూ నోటీసులు ఇచ్చిన విజయవాడ కమర్షియల్‌ కోర్టు నేడు ఆర్‌అండ్‌బీ శాఖకు హెచ్చరికలు జారీ చేసింది. విజయవాడలోని ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను అమ్మి అయినా కాంట్రాక్టు సంస్థకు నగదు చెల్లించాలని ఆదేశించింది. పక్షం రోజుల డెడ్‌లైన్‌ విధిస్తూ ఈ లోపు డబ్బులు చెల్లించాలని.. లేని పక్షంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్‌హౌస్‌ను అటాచ్‌ చేసి, దానిని విక్రయించి కాంట్రాక్టు సంస్థకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని ఆర్‌అండ్‌బీ ఉన్నతాధికారులకు స్పష్టం చేసింది. దీంతో ఆర్‌అండ్‌బీకి ఉన్న పరువు కాస్తా పోయినట్టు అయింది. నిబంధనల ప్రకారం చేసిన పనులకు డబ్బులు చెల్లించకపోతే కాంట్రాక్టు సంస్థలు కమర్షియల్‌ కోర్టుల ద్వారా న్యాయం పొందవచ్చన్నదానికి తాజా ఉదంతం అద్దం పడుతోంది.

Kunal Kamra: మరో వీడియో విడుదల చేసిన కునాల్ కామ్రా

Kunal Kamra: మరో వీడియో విడుదల చేసిన కునాల్ కామ్రా

శివసేన కార్యకర్తల విధ్వంసాన్ని పరోక్షంగా కునాల్ కామ్రా మీడియా ముందు ప్రస్తావిస్తూ.. ''ఇది ట్రయిలర్ మాత్రమే..ముందుంది అసలు సినిమా'' అంటూ ఒక సినిమాలోని పాపులర్ డైలాగ్‌ చెప్పారు.

Hyderabad: నో ఏసీ క్యాంపెయిన్ పేరుతో క్యాబ్ డ్రైవర్లు నిరసనకు సిద్ధం

Hyderabad: నో ఏసీ క్యాంపెయిన్ పేరుతో క్యాబ్ డ్రైవర్లు నిరసనకు సిద్ధం

హైదరాబాద్ క్యాబ్ డ్రైవర్లు మార్చి 24 నుంచి మరో నిరసనకు రెడీ అయ్యారు. ఈ క్రమంలో నో ఏసీ క్యాంపెయిన్ పేరుతో కార్లలో కస్టమర్లకు ఏసీలను వేయకుండా రైడ్లను నిర్వహిస్తారు. అయితే దీనికి గల కారణాలు ఏంటనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

Delhi: అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక

Delhi: అసెంబ్లీ స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక

సభా సంప్రదాయం ప్రకారం స్పీకర్‌గా విజేందర్ గుప్తా ఎన్నిక కాగానే ఆయనను ముఖ్యమంత్రి రేఖా గుప్తా, విపక్ష నేత సాదరంగా ఆయనను స్పీకర్ సీటుకు తోడ్కొని వెళ్లారు. ఇటీవల ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులందరికి కంటే ఎక్కువ మెజారిటీతో విజేందర్ గుప్తా గెలిచారు.

Siddepet: నలుగురి మృతదేహాలు లభ్యం.. పరిస్థితి ఎలా ఉందంటే..

Siddepet: నలుగురి మృతదేహాలు లభ్యం.. పరిస్థితి ఎలా ఉందంటే..

తెలంగాణ: సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం కొండపోచమ్మ సాగర్ డ్యాంలో గల్లంతయిన ఐదుగురిలో నలుగురి మృతదేహాలు లభ్యం అయ్యాయి. గల్లంతయిన వారిలో ఇప్పటివరకూ దినేశ్వర్, జతీన్, ధనుష్, సాహిల్ మృతదేహాలను గజ ఈతగాళ్లు బయటకు తీసుకువచ్చారు.

 Buddha Venkanna: వీడిని ఎన్‌కౌంటర్ చేసినా తప్పు లేదు!

Buddha Venkanna: వీడిని ఎన్‌కౌంటర్ చేసినా తప్పు లేదు!

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ప్రధాన అనుచరుడు తురకా కిషోర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ అరెస్ట్‌పై టీడీపీ నేత బుద్దా వెంకన్న స్పందించారు.

  poultry: కోళ్ల పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు విఫలం

poultry: కోళ్ల పరిశ్రమ యాజమాన్యంతో చర్చలు విఫలం

poultry: కర్లాంలోని కోళ్ల పరిశ్రమలో యాజమాన్యా నికి, కార్మికులకు మధ్య శనివారం జరిగిన చర్చలు మరోసారి విఫలమయ్యాయి. శుక్రవారం నుంచి కార్మికులు నిరవధిక దీక్షలు ప్రారంభించిన నేపథ్యంలో యాజమాన్యం శనివారం కార్మికులతో చర్చలు జరిపింది.

సంఘాలన్నీ సీపీఎస్‌ ఉద్యోగులను వాడుకున్నాయి

సంఘాలన్నీ సీపీఎస్‌ ఉద్యోగులను వాడుకున్నాయి

రాష్ట్రంలోని 147 సంఘాలు ఉపాధ్యాయ, ఉద్యోగులను మోసం చేశాయని, తెలంగాణ రాష్ట్ర సీపీఎస్‌ ఉద్యోగుల సంఘం (టీఎ్‌ససీపీఎ్‌సఈయూ)మాత్రమే సీపీఎస్‌ అంతమే పంతంగా ఉద్యమాలు చేస్తోందని సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ అన్నారు.

ISRO: చంద్రయాన్-4, 5లపై ఇస్రో కీలక అప్‌డేట్

ISRO: చంద్రయాన్-4, 5లపై ఇస్రో కీలక అప్‌డేట్

రానున్న సంవత్సరాలలో భారత్ చేపట్టనున్న అంతరిక్ష యాత్రల వివరాలను ఇస్రో సోమనాథ్ వెల్లడించారు. అంతరిక్షానికి మినిషి పంపించే లక్ష్యంగా నిర్దేశించుకున్న మొట్టమొదటి మానవ సహిత మిషన్ ‘గగన్‌యాన్’ను 2026లో చేపట్టే అవకాశం ఉందని ఆయన చెప్పారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి