Home » AP Pensions
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల (AP Elections) ముందు పెన్షన్ పంపిణీపై ఎంత హైడ్రామా నడుస్తోందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఆదేశాలు పాటించాల్సిందేనని ఎన్నికల కమిషన్.. కుదరదని ఏపీ ప్రభుత్వం చెబుతుండటంతో అసలు పెన్షన్ల కథేంటో తెలియని పరిస్థితి.! అయితే తాజాగా పెన్షన్ల పంపిణీపై బిగ్ అప్డేట్ వచ్చేసింది..
సామాజిక పింఛన్లను ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేయలేమని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి తేల్చేశారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి పొందడానికి సీఎం జగన్ రెడ్డి శవ రాజకీయాలు చేశారని ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. సోమవారం నాడు టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు మీడియాతో మాట్లాడుతూ... ఇళ్ల వద్దే పెన్షన్లు ఇవ్వాలని ఎన్నికల కమిషన్ చెప్పినా పింఛన్దారులను ఎండలో సచివాలయాలకు తిప్పారని మండిపడ్డారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పింఛన్ల పంపిణీపై గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పెన్షన్ల పంపిణీలో వలంటీర్లు జోక్యం చేసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆదేశించింది. దీంతో ఏపీలో పింఛన్ల (AP Pensions) పంపిణీ కొంత ఆలస్యం అయింది.
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ అంశం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఇస్తామన్న సమయకంటే ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో పెన్షన్లు తీసుకోడానికి సచివాలయాలకు వచ్చిన వృద్ధులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు తనువులు కూడా చాలించారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ సీరియస్ తీసుకుని ఈసీకి లేఖలు కూడా రాసింది. అయితే వృద్ధులు చనిపోవడంపై తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేంద్ర ఎన్నికల సంఘా ( Central Election Commission)నికి తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) లేఖ రాశారు. ఇంటింటికీ పెన్షన్ల పంపిణీలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం కారణంగా 33 మంది పెన్షన్ దారులు చనిపోయారని సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తూ శుక్రవారం లేఖ రాశారు.
రాష్ట్ర యువత ఈ ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి(Nara Bhuvaneshwari) అన్నారు. ‘నిజం గెలవాలి’ యాత్రలో భాగంగా నంద్యాల జిల్లాలో పర్యటించారు. చంద్రబాబు(Chandrababu) అక్రమ అరెస్టును తట్టుకోలేక మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆమె పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.
Andhrapradesh: పింఛన్ల విషయంలో ప్రభుత్వం ప్రజల ప్రాణాలు తీస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. తండ్రి చనిపోయినప్పుడు, బాబాయ్ చనిపోయినప్పుడు రాజకీయ లబ్ది పొందారన్నారు. వాలంటీర్లను చంపేసి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని వ్యాఖ్యలు చేశారు.
పింఛన్ల పంపిణీపై సీఎం జగన్ (CM Jagan) శవ రాజకీయం చేస్తున్నారని మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) ఆరోపించారు. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీపై జగన్, వైసీపీ నేతలు నిందలు వేస్తున్నారని మండిపడ్డారు.
Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం ఆరా తీస్తోంది. పెన్షన్ల పంపిణీపై ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఈసీ నేరుగా సమాచారం సేకరిస్తోంది. పలు జిల్లాలలో పెన్షన్ల పంపిణీపై ఎన్నికల సంఘం వివరాలు తీసుకుంది. కేంద్ర ఎన్నికల అబ్జర్వర్ల ద్వారా పెన్షన్ల పంపిణీ జరుగుతున్న తీరుపై ఈసీ వివరాల సేకరించే పనిలో పడింది.