Home » AP Election 2024
| పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
|---|---|---|---|
టీడీపీ + |
0 | 0 | 0 |
వైఎస్ఆర్సీపీ
|
0 | 0 | 0 |
కాంగ్రెస్ పార్టీ
|
0 | 0 | 0 |
ఇతరులు |
0 | 0 | 0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
151 |
తెలుగుదేశం పార్టీ |
23 |
జనసేన పార్టీ |
1 |
భారతీయ జనతా పార్టీ |
0 |
భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ |
0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
తెలుగుదేశం పార్టీ |
102 |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
67 |
భారతీయ జనతా పార్టీ |
4 |
ఇతరులు |
2 |
వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంగారెడ్డిలో పరారై పల్నాడు జిల్లా నరసారావుపేటలో ప్రత్యక్షమయ్యారు..
ఎన్నికల అధికారులను మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి బెదిరిస్తున్నారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర ఆరోపించారు. నియోజకవర్గంలో అధికారులను తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారని, మాట వినని వారిపై బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు చెప్పిన విధంగానే అధికారులు నడుచుకుంటున్నారని తాము ఐదేళ్లుగా మెుత్తుకున్నామన్నారు. ఎన్నికలు మొదలయ్యాక కూడా కొంతమంది అధికారుల తీరు మారలేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ సీఎస్ జహవర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డిపై మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమామహేశ్వరరావు హాట్ కామెంట్స్ చేశారు. సీఎస్గా జవహర్ రెడ్డి ఉంటే ఎన్నికల కౌంటింగ్ సజావుగా జరగదని, వెంటనే ఆయన్ని పదవి నుంచి తొలగించాలన్నారు. సీఎస్, అతని కుమారుడు భూదందాలు చేస్తున్నారని ఆరోపించారు. వారి భూదందాలను సాక్షాధారాలతో సహా బయటపెట్టామన్నారు. సీఎస్గా ఉండే అర్హత ఆయన కోల్పోయారని మండిపడ్డారు.
సీఎం జగన్పై రాయి దాడి కేసులో ఏ1 నిందితుడు సతీశ్కు బెయిల్ లభించింది. నిందితుడికి విజయవాడ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఏప్రిల్ 13న విజయవాడలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం జగన్పై రాయిదాడి జరగడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన 8వ అదనపు జిల్లా న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది.
ఏపీలో ఎన్నికల పోలింగ్ ముగిసింది. రాష్ట్ర ప్రజలంతా ఫలితాల కోసం నిరీక్షిస్తున్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేస్తుంది. జూన్4 ఎప్పుడు వస్తుందా అంటూ ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో ఏ నియోజకవర్గం ఫలితం ముందు వస్తుందనే ఆసక్తి అందరిలో ఉంటుంది. ఈవీఎంల ద్వారా ఎన్నికలు నిర్వహించడంతో ఓట్ల లెక్కింపు సులభతరమైంది.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు సరిగ్గా ఆరు రోజుల్లో రాబోతున్నాయి. దీంతో గెలుపుపై ఎవరి ధీమాలో వారున్నారు. ఇన్నాళ్లు వైనాట్ 175 అన్న వైసీపీ.. గెలిస్తే చాలు అన్నట్లుగా పరిస్థితులు ఉన్నాయి. ఇక కూటమిలో అయితే.. ఎట్టి పరిస్థితుల్లో గెలుస్తున్నాం.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నామని కుండ బద్ధలు కొట్టి చెబుతున్నారు. ఇంకో అడుగు ముందుకేసిన వైసీపీ..
ఏపీ రాజకీయాల్లో ఎన్నికల రిజల్ట్స్(Andhra Pradesh Election Results) కంటే.. మాచెర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి(MLA Pinnelli Ramakrishna Reddy) ఘటన ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. పిన్నెల్లి ఎక్కడ ఉన్నాడు? ఎప్పుడు అరెస్ట్ చేస్తారు? పోలీసుల కళ్లుగప్పి ఇంకెంత కాలం దాచుకోగలరు? అసలు ఆయనను రక్షిస్తోంది ఎవరు? ఆయనకు ఆశ్రయం ఇచ్చింది ఎవరు? ఇలా అనే ప్రశ్నలు ఉత్పన్నమవున్నాయి.
Bail to Pinnelli Ramakrishna Reddy: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. మూడు కేసుల్లో ఏపీ హైకోర్టు(AP High Court) కీలక తీర్పునిచ్చింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్(Anticipatory bail) మంజూరు చేసింది హైకోర్టు. అయితే, పలు షరతులు విధించింది. షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది ..
పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో నిబంధనల సడలింపుపై సీఈఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశామని మాజీ మంత్రి పేర్ని నాని తెలిపారు. అన్ని రాష్ట్రాలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై గతంలో నిబంధనలు పంపారన్నారు. పోస్టల్ బ్యాలెట్ కవర్లు, 13ఏ, 13బి నిబంధనలను చెప్పారన్నారు. గెజిటెడ్ అధికారి సంతకం పెట్టి స్టాంప్ వెయ్యాలని.. అలాగేస్టాంప్ లేకపోయినా చేతితో రాసినా ఆమోదించాలని గతంలో ఆదేశించారన్నారు.
దేశం మొత్తం నిర్ఘాంతపోయే విధంగా ఏపీలో ఫలితాలు రానున్నాయని ఎంపీ గోరంట్ల మాధవ్ అన్నారు. 2019 లో వచ్చిన ఫలితాలే తిరిగి పునరావృతం కానున్నాయని తెలిపారు. జూన్ 9వ తేదీన ఉదయం 9.35 నిమిషాలకు రుషికొండలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని స్పష్టం చేశారు.