Home » AP Election 2024
| పార్టీ | ఆదిక్యం | గెలుపు | మొత్తం |
|---|---|---|---|
టీడీపీ + |
0 | 0 | 0 |
వైఎస్ఆర్సీపీ
|
0 | 0 | 0 |
కాంగ్రెస్ పార్టీ
|
0 | 0 | 0 |
ఇతరులు |
0 | 0 | 0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
151 |
తెలుగుదేశం పార్టీ |
23 |
జనసేన పార్టీ |
1 |
భారతీయ జనతా పార్టీ |
0 |
భారతీయ జాతీయ కాంగ్రెస్ పార్టీ |
0 |
| పార్టీ | గెలుపు |
|---|---|
తెలుగుదేశం పార్టీ |
102 |
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
|
67 |
భారతీయ జనతా పార్టీ |
4 |
ఇతరులు |
2 |
ఏపీలో ఎన్నికల ఫలితాలపై ఆరా సంస్థ తన పోస్ట్పోల్ సర్వేను విడుదల చేసింది. ఏపీలో బీజేపీ మూడు లోక్సభ స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి సీఎం రమేష్, నరసాపురం నుంచి శ్రీనివాస వర్మ గెలిచే అవకాశాలు ఉన్నట్లు ఆరా సర్వేలో తేలిందన్నారు.
ఓ వైపు లోక్సభ ఎన్నికల ఫలితాలపై వరుసగా ఎగ్జిట్పోల్స్ వెలువడుతున్నాయి. అదే సమయంలో ఏపీలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల ఫలితాలపై ఒక్కో సర్వే సంస్థ తమ ఎగ్జిట్పోల్స్ను విడుదల చేస్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయనేది జూన్4న తేలనుంది. అయితే అంతకంటే ముందు అనేక ఎగ్జిట్పోల్స్ విడుదలవుతున్నాయి. ఏపీలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనేదానిపై పలు సర్వే సంస్థలు తమ సర్వే ఫలితాలను విడుదల చేస్తున్నాయి.
జిల్లాలో ఓట్ల కౌంటింగ్(Counting of votes)కు పటిష్ఠ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్ మల్లికార్జున(Collector Mallikarjuna), విశాఖ నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్(Visakha CP Ravi Shankar) తెలిపారు. ఆంధ్ర యూనివర్సిటీలో కౌంటింగ్ కోసం ఏడు హాళ్లు ఏర్పాటు చేశామని, ఒక కౌంటింగ్ కేంద్రానికి 14టేబుళ్లు, పోస్టల్ బ్యాలెట్ల కోసం మరొక ఏడు టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ మల్లికార్జున్ తెలిపారు.
తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)ని ఓడించాలనే పట్టుదలతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (CM Jagan) వ్యూహత్మకంగా పావులు కదిపారు. హిందూపురంలో ఓటమి ఎరుగని సైకిల్ పార్టీకి చెక్ పెట్టేందుకు భారీ స్కెచ్ వేశారు.
ఎగ్జిట్ పోల్స్.. ఎన్నికల పోలింగ్ తర్వాత, ఫలితాలకు ముందు వచ్చే సర్వేలు.! సెమీ ఫైనల్ లాంటి ఈ ఫలితాల కోసం దేశం మొత్తం ఎదురుచూస్తోంది. వాస్తవానికి పోలింగ్ రోజు లేదా ఆ తర్వాత రోజు రావాల్సిన ఎగ్జిట్ పోల్స్ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తయ్యి.. దేశ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతున్న నేపథ్యంలో ఆ ఆలస్యం కాస్త జూన్-01 వరకూ వెళ్లింది. దేశంలో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు పూర్తవ్వడంతో ఇవాళ అనగా శనివారం నాడు..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఎవరు గెలవబోతున్నారు..? ఏ పార్టీకి ఎన్ని సీట్లు రాబోతున్నాయి..? కూటమి గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందా..? వైసీపీ రెండోసారి గెలిచి సర్కార్ను కంటిన్యూ చేస్తుందా..? ఇప్పుడిదే ఎక్కడ చూసినా చర్చ...
ఈసారి లోక్సభ ఎన్నికలు మొత్తం ఏడు దశల్లో జరిగాయి. ఏప్రిల్ 19వ తేదీ నుంచి మొదలుకొని జూన్ 1వ తేదీ వరకు.. వారం రోజుల గ్యాప్ చొప్పున ఏడు దశల్లో పోలింగ్ సాగింది. ఏడో దశ..
కారంపూడి సీఐ నారాయణస్వామి(CI Narayana Swamy)పై ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది. నారాయణస్వామిని విధులకు దూరంగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. కారంపూడిలో సీఐ నారాయణస్వామి శాంత్రిభద్రతలు కాపాడటంలో విఫలమయ్యారని, తనపై తప్పుడు కేసులు పెట్టారంటూ ఏపీ హైకోర్టు(AP High Court)ను పిన్నెల్లి ఆశ్రయించారు. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం సీఐను విధులకు దూరంగా ఉంచాలని సీఈవో ముకేశ్ కుమార్ మీనాను ఆదేశించారు. దీంతో సీఐ నారాయణస్వామిని విధుల నుంచి ఈసీ తప్పించింది.
ఏపీ ఎన్నికల ఫలితాలపై తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పందించారు. నేడు ఆయన తిరుమల శ్రీవారిని ఆయన దర్శించుకున్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారా..? లేక వైసీపీకీ పట్టం కడతారోనన్న ఉత్కంఠ నెలకొందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలిపారు.