Home » AP DGP
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా ఢిల్లీకి చేరుకున్నారు. అశోకా రోడ్డులోని ఏపీ భవన్కి చేరుకున్నారు. పోలింగ్ మరుసటి రోజు రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్యలు, హింసాత్మక ఘటనలపై ఈసీ ముందు హాజరయ్యేందుకు ఇరువురు అధికారులూ ఢిల్లీకి చేరుకున్నారు. రాష్ట్రంలో జరుగుతున్న హింసాత్మక ఘటనలపై ఎలక్షన్ కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఏపీ సార్వత్రిక ఎన్నికలకు (AP Elections 2024) పోలింగ్ ముగిసినా తర్వాత కూడా రాష్ట్రంలో వైసీపీ (YSRCP) అరాచకాలు పెరిగిపోతున్నాయి. ఏపీ వ్యాప్తంగా వైసీపీ మూకలు పోలింగ్ రోజు(మే13) నుంచి భారీగా అల్లర్లు, అరాచకాలకు పాల్పడుతున్నాయి. మరోసారి ఎలాగైనా అధికారంలోకి రావడానికి వైసీపీ పెద్దఎత్తున దాడులకు ప్లాన్ చేసినట్లు ప్రతిపక్షాల నేతలు ఆరోపిస్తున్నారు.
మాచర్ల, చంద్రగిరి, తాడిపత్రి ఘటనలపై ఏపీ డీజీపీ హరీష్ గుప్తాకి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) ఫిర్యాదు చేశారు. మంగళవారం డీజీపీకి చంద్రబాబు ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు.
AP New DGP: ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ గుప్తా నియామకం అయ్యారు. తక్షణమే విధుల్లో చేరాలని ఈసీ ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్ ఇంచార్జీ డీజీపీగా శంఖబ్రత బాగ్చీ బాధ్యతలు స్వీకరించారు. అధికార వైసీపీకి అనుకూలంగా రాజేంద్రనాథ్ రెడ్డి పనిచేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. దాంతో వెంటనే ఆయన్ను పదవి నుంచి ఎన్నికల సంఘం తొలగించింది. కొత్త డీజీపీ నియమించే వరకు శంఖబ్రత బాగ్జీ ఇంచార్జీ డీజీపీగా విధులు నిర్వహిస్తారు.
అధికార వైసీపీతో అంటకాగిన డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిపై బదిలీ వేటు పడింది. కొత్త డీజీపీగా ఎవరొస్తున్నారు..? రేసులో ఎవరెవరున్నారు..? ఎవరికి ఈ పదవి దక్కే ఛాన్స్ ఉంది..? ఇప్పుడిదే ఏపీ రాజకీయాల్లో జరుగుతోన్న పెద్ద చర్చ..!!