Home » AP CM YS Jagan
రామతీర్థంలో శ్రీరాముడి విగ్రహం తల నరికేశారు. అంతర్వేదిలో శ్రీలక్ష్మీనరసింహస్వామి దివ్యరథాన్ని తగులబెట్టారు. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ వెండి రథంలోని వెండి సింహాల ప్రతిమలు అపహరించారు.
ఏపీ సీఎం జగన్ ఓ జాతీయ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఇచ్చిన సమధానాలపై జగన్ను నెటిజన్లు ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. సీఎం స్థాయిలో ఉండి అవేం సమాధానాలంటూ కామెంట్స్ పెడుతున్నారు. జాతీయ రాజకీయాలపై జగన్ ఇచ్చిన సమాధానంపైనా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. కొంతమంది జగన్ ఇంటర్వ్యూపై పాజిటివ్ కామెంట్స్ చేస్తుంటే మరికొంతమంది మాత్రం సీఎం కన్ఫ్యూజన్లో ఉన్నట్లు ఉన్నారని, ఏమి మాట్లాడుతున్నారో తెలియడం లేదంటూ కామెంట్స్ పెడుతున్నారు.
ఏపీ సీఎం జగన్ కన్ఫ్యూజన్లో ఉన్నారా.. ఓటమి భయం ఆయనను వెంటాడుతుందా.. ఐదేళ్ళలో రాష్ట్రానికి ఏం చేశామో చెప్పుకునే పరిస్థితుల్లో లేరా.. ఏ ప్రశ్న వేసినా సూటిగా ఎందుకు సమాధనాం చెప్పలేకపోతున్నారు.. సరైన సమాధానం చెప్పడానికి ఎందుకు సంకోషిస్తున్నారు.. ప్రశ్నలు అడిగితే టెన్షన్ ఎందుకు పడుతున్నారు.. ఇప్పడు ఏపీ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవే..
ఏపీలో రాజకీయ పార్టీలు యువత జపం చేస్తున్నాయి. ఇప్పటికే పేద, మధ్యతరగతికి చెందిన వృద్ధులు, మహిళల్లో ఎక్కువమంది ఎవరికి ఓటు వేయాలో డిసైడ్ అయిపోయారు. మరోవైపు ఉద్యోగులు, వేతన జీవులు సైతం ఓటు ఎవరికి వేయాలనేదానిపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో యువత ఓట్లు ఈ ఎన్నికల్లో కీలకం కానున్నాయి. మొదటిసారి ఓటు వేయనున్న వారి సంఖ్య దాదాపు 10.3 లక్షలు కావడంతో.. వీరి ఓట్లను ఆకర్షించేందుకు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో వరుసగా రెండోసారి అధికారంలోకి రావడమే వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది. మేజిక్ ఫిగర్కు అవసరమైన సీట్లను సాధించడానికి రాజకీయ వ్యూహాలకు పదునుపెడుతోంది. వైసీపీపై ప్రజల్లో వ్యతిరేకత ఎక్కువుగా ఉండటంతో వైసీపీ నేతలు ఒకింత ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర తర్వాత కూడా నియోజకవర్గాల్లోని పరిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవనే సంకేతాలు వెలువడటంతో ఇక చివరి అస్త్రాన్ని ప్రయోగించాలని వైసీపీ నిర్ణయించినట్లు తెలుస్తోంది.
ఏపీలో అధికారమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఓవైపు.. వైసీపీ మరోవైపు ఎన్నికల వ్యూహాలు రచించి ముందుకెళ్తున్నాయి. ఇరు పక్షాలు ప్రతి సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లతో సంచలన విజయం సాధించగా.. అలాంటి విజయాన్ని సాధించాలని ఎన్డీయే కూటమి లక్ష్యంగా పెట్టుకుంది. వైసీపీ మాత్రం వైనాట్ 175 అంటూనే.. మెజార్టీ సీట్లలో అధికారమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో గెలవడం 2019లో గెలిచినంత ఈజీ కాదనే అభిప్రాయానికి వైసీపీ నాయకులు వచ్చినట్లు తెలుస్తోంది.
రాయి దాడి ఘటనపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద తనను కలిసిన కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రాణాపాయం తప్పిందని, మరోసారి అధికారంలోకి వస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.
వైసీపీ అధినేత జగన్లో రోజురోజుకు ఓటమి భయం పెరుగుతుందా.. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి కట్టడంతో ఆందోళన చెందుతున్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కంటే ముందే 175 నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. ఈనెల 20వ తేదీన మేనిఫెస్టో విడుదల చేస్తామని ప్రకటించింది. కానీ తాజాగా మేనిఫెస్టో విడుదల వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోపై కసరత్తు పూర్తయిందన్న వైసీపీ వెనక్కి తగ్గడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పేరుకే ఆయన ఉద్యోగ సంఘాల నాయకుడు! చేసేది మాత్రం ముఖ్యమంత్రి జగన్ భజన! ఆయనే... రాష్ట్ర సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగుల గౌరవాధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి. ఉద్యోగుల సమస్యలు, డిమాండ్ల సంగతి పక్కనపెట్టి... శ్రుతిమించిన స్వామిభక్తి ప్రదర్శిస్తున్నారు...
మూడు రాజధానులంటూ మూడు ముక్కలాటకు తెరలేపి... రాష్ట్రాన్ని ఒక్క రాజధాని కూడా లేకుండా చేసి..