Home » AP Capital Row
Andhrapradesh: రాజధాని తరలింపు నిర్ణయం వైసీపీకి మరణశాసనమని ఏపీసీసీ మీడియా ఛైర్మెన్ డాక్టర్ నర్రెడ్డి తులసి రెడ్డి వ్యాఖ్యలు చేశారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇది ఒక చారిత్రిక తప్పిదమన్నారు. ఏ ప్రాంతం వాళ్ళు కూడా ఈ నిర్ణయాన్ని హర్షించడం లేదన్నారు. రాజధానిని విశాఖకు తరలిస్తే, ప్రశాంతమైన ఉత్తరాంధ్ర అశాంతి మయం, మాఫియా మయం అవుతుందని.. కాబట్టి తరలించ వద్దన్నారు.
Andhrapradesh: విజన్ వైజాగ్ సదస్సులో రాజధాని అమరావతిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మరోసారి విషం కక్కారు. ఎన్నికల తరువాత తాను విశాఖలో ఉంటానని సీఎం చెప్పారు. మళ్ళీ రెండవసారి ముఖ్యమంత్రిగా తాను విశాఖలోనే ప్రమాణస్వీకారం చేస్తానని స్పష్టం చేశారు. తాను విశాఖ వచ్చేందుకు అనేకసార్లు ప్రయత్నించిన రానివ్వలేదని తెలిపారు.
Andhrapradesh: రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేకహోదా సాధన సమితి శుక్రవారం ఆందోళనకు దిగారు. హోదా సాధించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ప్రత్యేక హోదా సాధన సమితి ఆరోపించింది. ప్రత్యేక హోదా కోసం తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయం ముట్టడికి నేతల యత్నించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఆందోళనకారులను అడ్డుకున్నారు.
Nara Lokesh: హైదరాబాద్ ఉమ్మడి రాజధాని పేరిట వైసీపీ నేతలు మరో మోసానికి దిగారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ధ్వజమెత్తారు.
Andhrapradesh: హైదరాబాద్ను ఏపీ రాజధానిగా కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీసుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఏపీలో పెనుదుమారాన్ని రేపుతున్నాయి. సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
Andhrapradesh: బ్రహ్మంగారి కాలజ్ఞానంలో తిరుపతి రాజధాని నగరం అవుతుందని నాడు రాశారని.. ఆనాడు తిరుపతి రాజధాని అంటే కాదని కర్నూలుకు, హైదరాబాద్కు మార్చారని మాజీ ఎంపీ చింతామోహన్ అన్నారు.
Andhrapradesh: ఏపీ రాజధానిగా హైదరాబాద్ను కొనసాగించాలంటూ వైసీపీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు రచ్చకు దారితీయడంతో వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది.
Andhrapradesh: హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలన్న వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యలపై టీడీపీ సీనియర్ నేత ధూళిపాళ నరేంద్ర స్పందించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజధానిని ముక్కలు చేసే బాధ్యత వైవీ సుబ్బారెడ్డికి సీఎం జగన్ అప్పజెప్పారన్నారు.
విశాఖలో సముద్ర తీరాన రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో సముద్రంలో చేపల వేటకు వెళ్లే బోట్లకు ట్రాకింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన తెరపైకి వచ్చింది...
అవును.. ఆంధ్రప్రదేశ్ రాజధాని (AP Capital) విశాఖ తరలిస్తున్నాం.. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఉగాదికి తరలిస్తాం.. అబ్బే అంతకుముందే దసరాకు వచ్చేస్తాం.. అయ్యో అది కూడా కాదబ్బా.. క్రిస్మస్క్ పక్కా అంతే.. ఇవీ వైసీపీ ప్రభుత్వం, ఆ పార్టీ నేతలు ఊరింపు మాటలు. సీన్ కట్ చేస్తే అంతా తూచ్.. విశాఖకు పాలనా రాజధాని తరలింపు కేవలం ప్రచారం మాత్రమేనని ఇప్పటికే ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’ పరిశీలనలో తేలిపోయింది..