Home » AP Assembly Speaker
తెలుగు భాష గొప్పతనాన్ని, భాషలో మాధుర్యాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దేశంలో ఎన్ని భాషలున్నా.. తెలుగుభాష ప్రత్యేకతే వేరు. మారుతున్న కాలంలో మాతృభాషను మర్చిపోతున్న వేళ.. ఏపీ అసెంబ్లీలో చోటుచేసుకున్న అరుదైన ఘటన మాతృభాష ప్రేమికులకు మిక్కిలి సంతోషానిస్తోంది.
Andhrapradesh: గత సమావేశాల వరకూ గవర్నర్ను అసెంబ్లీకి దొడ్డిదారిన తెచ్చినట్లుగా చుట్టూ తిప్పి వెనుక నుంచి తీసుకొచ్చేవారని స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు అన్నారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో మాట్లాడుతూ... ఈ సమావేశాలకు గవర్నర్ను రాచమార్గంలో ముందు వైపు నుంచీ తీసుకొచ్చామన్నారు.
ప్రజలు తమ సమస్యలు చెప్పుకొనే అవకాశం కల్పించడం ప్రభుత్వ కనీస బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం ఏపీ అసెంబ్లీలోని గేట్-2ను ఆయన దగ్గరుండి తెరిపించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో అసాధారణ రీతిలో ఆంక్షలు, ఇబ్బందులు, వివక్షకు గురైన దమ్మున్న మీడియా సంస్థ ‘ఏబీఎన్-ఆంధ్రజ్యోతి’కి (ABN Andhrajyothy) ఏపీ అసెంబ్లీ సెక్రటేరియెట్ గుడ్న్యూస్ చెప్పింది.
ఏపీలో కొత్త ప్రభుత్వం కొలువుదీరి పది రోజులు గడుస్తోంది. అలాగే 16వ శాసనసభకు ఎన్నికైన కొత్త ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం పూర్తైంది. 16వ శాసనసభ తొలిసమావేశాలు రెండు రోజులపాటు జరిగాయి.
తెలుగు రాష్ట్రాల్లోనే బీసీ నాయకుల్లో అయ్యన్నపాత్రుడు సీనియర్ నేత అని, ఆయనకు స్పీకర్ స్థానం దక్కడం సంతోషంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. శనివారం అసెంబ్లీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైన అయ్యన్నపాత్రుడిని ఆయన, ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్, మంత్రులు
రాష్ట్ర 16వ శాసనసభ సభాపతిగా బీసీ నాయకుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శనివారం ఉదయం ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం, ముఖ్యమంత్రి
మాజీ సీఎం జగన్కు కనీసం సభ మర్యాద కూడా లేదని.. తన రాజకీయ జీవితంలో ఇలాంటి నేతను ఎప్పుడు చూడలేదని అసెంబ్లీ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు (Chintakayala Ayyannapatrudu) అన్నారు.స్పీకర్ ఎన్నిక సమయంలో విపక్షం ఉండటం అనేది సభా సాంప్రదాయమని తెలిపారు.
అక్రమాలను, అరాచకాలను ప్రశ్నిస్తున్నారనే అక్కసుతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతిపై(ABN Andhra Jyothy) గత ప్రభుత్వం విధించిన నిషేధాన్ని.. కొత్త ప్రభుత్వం తొలగించింది. ఏబీఎన్తో పాటు మరో రెండు ఛానల్స్పై గత అసెంబ్లీ విధించిన నిషేధాన్ని స్పీకర్ అయ్యన్న పాత్రుడు(Speaker Ayyanna Patrudu) తొలగించారు.
స్పీకర్ ఎన్నికకు వైసీపీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు. ఒక్కరంటే ఒక్కరు కూడా హాజరు కాలేదు. ముందుగానే వైసీపీ కీలక నేత, ఎమ్మెల్యే పెద్దిరెడ్డికి స్పీకర్ ఎన్నిక గురించి పయ్యావుల కేశవ్ సమాచారం అందించారు. పైగా వైసీపీ అధినేత జగన్కు దీనిపై సమాచారం అందించాలని కూడా తెలిపారు. అయినా సరే.. వైసీపీ నుంచి అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు వేరెవ్వరూ హాజరు కాలేదు.