Home » AP Assembly Sessions
‘రాజ్యాంగ బద్ధంగానే రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం ఆర్థిక విషయాల్లో ఉల్లంఘనలకు పాల్పడింది. ఆర్థిక రంగాన్ని కుదేలు చేసింది.
61 శాతం అంబులెన్స్లో సెలైన్ల కొరత ఉండటంతోపాటు ఫస్ట్ ఎయిడ్ కొరతా ఉన్నట్లు కాగ్ నిర్ధారించిందని అసెంబ్లీలో ఎమ్మెల్యే సోమిరెడ్డి ఆధారాలు బయటపెట్టారు. అరబిందో 430 అంబులెన్స్లు నడిపి 720 అన్నట్లు ప్రభుత్వానికి లెక్కలు చూపిందని పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర వెల్లడించారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముందుగా ప్రశ్నోత్తర సమయం కొనసాగుతోంది. మంత్రి అనగాని సత్య ప్రసాద్ మాట్లాడుతూ.. నిరుపయోగంగా ఉన్న భూమలును పేదలకు అసైన్డ్ చేసిందని, గత ప్రభుత్వం ఎన్నికలకు ఆరు నెలల ముందు నిషిద్ద 22 ఏ నుండి 9 లక్షలకు పైచిలుకు తొలగించాలని చూసారన్నారు.
గత అసెంబ్లీలో మాజీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని మద్యంతో కుటుంబాలు ఎలా ఇబ్బంది పడుతున్నాయనే అంశంపై మాట్లాడిడే.. ఆమెపై వైసీపీ సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోల్ చేసిందని రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాసు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అంశంపై అప్పట్లో స్పీకర్కు ఫిర్యాదు చేశామని గుర్తుచేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమైన విషయం తెలిసిందే. అసెంబ్లీలో నేడు పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. పీఎంఏవై ద్వారా రాష్ట్రంలో ఏపీ టిడ్కో అధ్వర్యంలో నిర్మించిన ఇళ్లపై సభలో సల్ప కాలిక చర్చ జరగనుంది.
అసెంబ్లీలో ప్రశ్నోత్తర సమయంలో మంత్రి నారా లోకేష్ ఎడ్యుకేషన్కు సంబంధించి మాట్లాడారు. 20 నుంచి 30 కిలోమీటర్ల మధ్య డిగ్రీ కళాశాల ఉండాలనేది నిబంధన అని అన్నారు. ఇంటర్మిడియట్ ఎడ్యూకేషన్, స్కూల్ ఎడ్యుకేషన్కు చాలా తేడా ఉంటుందని, గత ప్రభుత్వం ఇంటర్ విద్యార్ధులకు టెక్ట్స్ బుక్స్ కూడా ఇవ్వలేదని ఆయన విమర్శించారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాల్గవ రోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. ముుందుగా ప్రశ్నోత్తరాల సమయం కొనసాగుతోంది. ప్రశ్నోత్తరాల అనంతరం వార్షిక బడ్జెట్పై చివరి రోజు చర్చ కొనసాగనుంది. తర్వాత ప్రభుత్వం సభలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టనుంది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నాల్గవరోజు శుక్రవారం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వం సభలో రెండు బిల్లులు ప్రవేశ పెట్టనుంది. 1. ఆంధ్రపదేశ్ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ బిల్లును ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశ పెట్టనున్నారు. 2. ఏపి ఎలక్ట్రిసిటీ డ్యూటీ చట్ట సవరణ బిల్లును విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ సభలో ప్రవేశ పెట్టనున్నారు.
గత ఐదేళ్లలో ఒక్క రోజు కూడా అసెంబ్లీ సజావుగా... బూతులు లేకుండా సభ జరగలేదని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. నాటి ఈ కౌరవ సభ కనుక వెళ్లిపోయి.. ప్రస్తుతం గౌరవ సభలో తాను అడుగుపెట్టానని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎంపికైన ఉండి ఎమ్మెల్యే కనుమూరి రఘు రామకృష్ణరాజు (ట్రిపుల్ ఆర్)పై సీఎం చంద్రబాబు ప్రశంసల వర్షం కురిపించారు. అంతర్జాతీయంగా ట్రిపుల్ ఆర్ చిత్రం సంచలనం సృష్టింస్తే.. ఈ లీడర్ ట్రిపుల్ ఆర్ పోలిటికల్గా సంచలనం సృష్టించారన్నారు.