Home » AP Assembly Sessions
ఏపీ శాసనసభలో గురువారం 6 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం పొందనున్నాయి. టెండర్లను న్యాయ పరిశీలనకు పంపే బిల్లు రద్దు, ఆలయాల ధర్మకర్తల మండళ్లలో సభ్యుల సంఖ్యకు అదనంగా మరో ఇద్దరిని నియమించుకునే వెసులుబాటు కల్పిస్తూ దేవాదాయశాఖ సవరణ చట్టం, సహజ వాయువుపై వ్యాట్ను తగ్గిస్తూ తీసుకొచ్చిన బిల్లు, ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తదితర బిల్లులపై సభలో చర్చించి ప్రభుత్వం ఆమోదించనుంది.
ఏపీ శాసనమండలి సమావేశాలు హాట్ హాట్గా జరుగుతున్నాయి. అధికార.. విపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు, మాటల యుద్ధం జరుగుతోంది. వైఎస్సార్ సీసీకి మండలిలో మెజారిటీ సభ్యుల సంఖ్య ఉన్నప్పటికీ కూటమి మంత్రులు, ఎమ్మెల్సీలు ధీటుగా బదులిస్తున్నారు. దాంతో వైఎస్సార్ సీసీ ఎమ్మెల్సీలు సభలో ఉండలేక వాకౌట్ చేస్తున్నారు.
గ్రామాలను స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అన్నారు.
మదనపల్లెలో భూరికార్డుల దహనం ఘటనపై శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. రె
పోలవరం నిర్వాసితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం భూములు, ఇళ్లు వదులుకున్నారని అసెంబ్లీలో పోలవరం ఎమ్మెల్యే బాలరాజు చెప్పారు. వారి కోసం 70 శాతం పునరావాస కార్యక్రమాలు గత టీడీపీ హయాంలోనే పూర్తి చేశారని ఆయన చెప్పారు.
సభా నాయకుడిపైనే ఇలాంటి కుట్ర జరిగితే మరి మామూలు జనం పరిస్థితి ఏంటనేది ఆలోచించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. ఈ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలన్నారు. ఇది ముఖ్యమైన అంశమని, దీనిపై తప్పనిసరిగా చర్చించాలని డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణం రాజు కూడా అన్నారు.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం 9 గంటలకు ప్రశ్నోత్తరాలతో ప్రారంభం కానున్నాయి. అనంతరం పలు బిల్లులను ప్రభుత్వం సభలో ప్రవేశపెట్టనుంది. కాగా పలు డిపార్టె మెంట్లకు సంబందించిన డిమాండ్స్పై ఆయా శాఖల మంత్రులు వివరణ ఇస్తారు.
ప్రభుత్వ అధికారుల్లో పాత వాసనలు పోలేదంటూ కూటమి ఎమ్మెల్యేలు సోమవారం శాసనసభలో ధ్వజమెత్తారు.
శాసనమండలిలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు రాష్ట్ర గనుల మంత్రి కొల్లు రవీంద్ర సమాధానమిస్తూ.. వెలగలేరు, వేమవరం, కొత్తూరుతాడేపల్లి గ్రామాల్లో జరిగిన అక్రమ మైనింగ్ వ్యవహారంలో అప్పటి ఎమ్మెల్యే ప్రమేయం ఉందన్నారు.
దళితుడిని చంపి డోర్ డెలివరీ చేసి వచ్చిన వారూ శాసన మండలిలో నీతులు చెప్పడం దారుణమని రాష్ట్ర హోం మంత్రి అనిత వైసీపీ సభ్యులపై నిప్పులు చెరిగారు.