Home » AP Assembly Sessions
ఏపీ అసెంబ్లీ లాబీలో పీఏసీ సభ్యత్వానికి శుక్రవారం ఓటింగ్ జరగనుంది. మొత్తం 12 మంది సభ్యుల పదవులకు ఎన్నిక జరుగుతుంది. బలం లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బరిలోకి దిగింది. దీంతో సంఖ్యాబలం ప్రకారమే ముందుకు వెళ్లాలని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పార్టీలు నిర్ణయించాయి.
రాయలసీమ, ఉత్తరాంధ్రలోని ఏడు వెనుకబడిన ఉమ్మడి జిల్లాల అభివృద్ధికి కేంద్రం ప్రత్యేక ప్యాకేజీ కింద 2014నుంచి ఇప్పటి వరకూ 250కోట్ల చొప్పున ...
రాష్ట్ర విభజన అనంతరం 2014-19 మధ్య కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం ఎంతో కష్టపడి పారిశ్రామిక, ఐటీ, ఎలకా్ట్రనిక్స్ కంపెనీలను తీసుకొచ్చిందని... కానీ, జగన్ వచ్చాక ఆ కంపెనీలు రాష్ట్రం వదిలిపోయేలా చేశారని మంత్రి నారా లోకేశ్ అన్నారు.
విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తేలేదని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్ స్పష్టం చేశారు.
రాష్ట్ర అసెంబ్లీ గురువారం పలు కీలక బిల్లులకు ఆమోదం తెలిపింది. మహిళల వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్నవారి భరతం పట్టడంతోపాటు రేషన్ బియ్యం స్మగ్లింగ్, ఇసుక మాఫియాలను ప్రివెంటివ్ డిటెన్షన్ (పీడీ) యాక్టు పరిధిలోకి తీసుకొస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సవరణ బిల్లు, భూ దురాక్రమణల (నిషేధిత) సవరణ బిల్లుతో పాటు మరో 5 బిల్లులను ఆమోదించింది.
‘ఇష్టానుసారంగా చేస్తే.. ఇకపై మీ ఆటలు సాగవ్! రాజకీయ ముసుగులో ఉన్న నేరస్థుల భరతం పడతా. రౌడీలు, భూ కబ్జాదారులు, సంఘ విద్రోహ శక్తులు గుండెల్లో రైళ్లు పరుగెత్తించే కఠినమైన చట్టాలను అమలు చేస్తాం.
Bhogapuram Airport: భోగాపురం ఎయిర్పోర్ట్ విషయంలో ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విమానాశ్రయానికి ఓ స్వాతంత్ర్య సమరయోధుడి పేరు పెడుతూ శాసనసభలో ఓ ప్రతిపాదన చేసింది.
CM Chandrababu Naidu: ఏపీ అసెంబ్లీ సమావేశాలు జోరుగా సాగుతున్నాయి. శాసనసభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తప్పు చేయాలంటేనే వణుకు పుట్టాలి అంటూ వారికి వార్నింగ్ ఇచ్చారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా.. గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు ప్రమాణస్వీకారం చేసి.. ఇంతవరకు అసెంబ్లీకి రాకపోయినా.. పీఏసీ ఛైర్మన్ పదవి కావాలంటూ గురువారం ఆ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నామినేషన్ వేసేందుకు అసెంబ్లీకి వచ్చారు. ఆయనకు మద్దతుగా కొంతమంది ఎమ్మెల్యేలు కూడా వచ్చారు.
గత జగన్ పాలన పాపం ఫలితంగా లిప్ట్ స్కీములు పని చేయక 4 లక్షల ఎకరాలు బీడుపడ్డాయని... తాళ్ళూరు లిప్ట్ మాత్రమే కాదు, రాష్ట్రంలో అన్ని లిఫ్ట్లు ప్రస్తుతం శిధిలావస్థలో ఉన్నాయని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. తాళ్ళూరు లిప్ట్కు సంబంధించి పిఎస్సి పైపుల స్దానంలో ఎమ్మెస్ పైపుల ఏర్పాటుకు అంచనాలు రూపొందిస్తున్నామని చెప్పారు.