Home » Anna Canteen
పల్నాడు జిల్లా: సత్తెనపల్లిలో అన్న క్యాంటీన్ పనులను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ గురువారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదల ఆకలి తీర్చాలని అన్న క్యాంటీన్లు పెట్టిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడుదే అన్నారు. తెలుగుదేశం హయాంలో పేదలకు అనేక సంక్షేమ పథకాలు అందుతున్నాయని, అన్న క్యాంటిన్లలో ఐదు రుపాయలకే భోజనం ఏర్పాటు చేశారన్నారు.
ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ముందుకెళ్తుందనే చర్చ ప్రజల్లో సాగుతోంది. ఓవైపు టీడీపీ అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీలు అమలు చేయరంటూ ఎన్నికలకు ముందు వైసీపీ విస్తృతంగా ప్రచారం చేసింది.