Home » Anna Canteen
పేదల ఆకలి తీర్చడమే టీడీపీ కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్రెడ్డి, పులివెందుల నియెజకవర్గ టీడీపీ ఇనచార్జ్ రవీంద్రనాథరెడ్డి (బీటెక్ రవి) పేర్కొన్నారు.
అన్నా క్యాంటీన్లు ఏర్పాటు పేదలకు ఒక వరమని, ధరలు పెరిగినా సీఎం చంద్రబాబునాయుడు రూ.5కే మళ్లీ ప్రారంభించారని జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు.
అన్న క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని సీఎం చంద్రబాబు కోరారు. అన్న క్యాంటీన్ల కోసం సుమారు రూ. 150 కోట్లు ఖర్చు అవుతుందని సీఎం చంద్రబాబు తెలిపారు.
Andhrapradesh: తణుకు అన్న క్యాంటీన్లో ప్లేట్ల అంశంపై వైసీపీ విష ప్రచారం చేస్తోందని మంత్రి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. చేతులు కడిగే సింక్లో తినే ప్లేట్లు పడేసింది వైసీపీ మూకలే అని అన్నారు. విషప్రచారం చేసేందుకే సైకో బ్యాచ్ ఈ పనిచేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పేదలకు పట్టెడన్నం పెట్టి కడుపు నింపిన అన్న క్యాంటీన్లు తిరిగి పునఃప్రారంభమయ్యాయి. ఉదయం నుంచే భారీ ఎత్తున పేదలు, కూలీలు, భవన కార్మికులు బారులు తీరడంతో క్యాంటీన్ల పరిసరాలు కోలాహలంతో నిండిపోయాయి.
Andhrapradesh: తూర్పు నియోజకవర్గం పటమట హైస్కూల్ వద్ద అన్న క్యాంటీన్ను ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, కలెక్టర్ సృజన, మున్సిపల్ కమీషనర్ ధ్యానచంద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ.. పేదల కడుపు నింపే లక్ష్యంతో చంద్రబాబు అన్న క్యాంటీన్లను ప్రారంభించారన్నారు.
Andhrapradesh: నెల్లూరు నగరంలోని చేపల మార్కెట్ వద్దా అన్నా క్యాంటిన్ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2014 -19 మధ్య 203క్యాంటీన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని... 173 క్యాంటీన్లు అప్పుడు ప్రారంభించామన్నారు.
ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి హామీ ఇచ్చినట్టుగా ‘అన్న క్యాంటీన్లు’ పున:ప్రారంభమయ్యాయి. నిన్న (గురువారం) స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దంపతులు ఈ పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే.
రాష్ట్రంలో పునఃప్రారంభమైన అన్న క్యాంటీన్లకు విరాళాలందించే విషయంలో ప్రజల నుంచి భారీగా స్పందన వస్తోంది. పేదలకు ఐదు రూపాయలకే భోజనం అందించే నిమిత్తం పారిశ్రామికవేత్తలు, సాధారణ ప్రజలు, వృద్ధులు సైతం తరలి వచ్చి విరాళాలిస్తున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో ‘ అన్న క్యాంటీన్’ను మంత్రి నిమ్మల రామానాయుడు ప్రారంభించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే దుర్మార్గంగా పేదవాడికి అన్నం పెట్టే అన్న క్యాంటీన్లను మూసి వేశాడని ఆయన మండిపడ్డారు.