Home » Anantapur urban
నీటి నాణ్యత ప్రమాణాల పరీక్షలను ఎప్పటికప్పుడు చేపట్టాలని కలెక్టర్ వినోద్కుమార్ పే ర్కొన్నా రు. మండలంలోని ఆలమూరులో శనివారం వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ డబ్ల్యూఎస్ శాఖల పరిధిలో చేపడుతున్న నీటి నాణ్యత పరీక్షలను ఆయన తనిఖీ చేశారు. వేసవి నేపథ్యంలో నీటినాణ్యత ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలన్నారు.
తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఎంపీ అంబికా లక్ష్మీనారా యణ పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
ఏపీ సూపర్ కప్ - 2025 ఫుట్బాల్ పోటీల విజేతగా గోదావరి క్లబ్ జట్టు నిలిచింది. నగరంలోని ఆర్డీటీ స్టేడియంలో గురువారం ఫైనల్స్ నిర్వహించారు. లీగ్ పోటీల్లో ముందంజలో ఉన్న కొల్లేరు 18 పాయింట్లు, గోదావరి 15 పాయింట్లు సాధించి ఫైనల్స్లో తలపడ్డాయి. ఎక్కడా ఓటమి లేకుండా ఫైనల్స్కు చేరిన కొల్లేరు జట్టుపైనే అందరూ ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా పుంజుకున్న గోదావరి జట్టులో దిలీప్, అక్షయ్ చెరో గోల్ చేశారు.
జిల్లా సర్వజన ఆస్పత్రిలో ఎట్టకేలకు వాహనాల పార్కింగ్ సమస్యకు పరిష్కారం చూశారు. నిత్యం వందల మంది రోగులు చికిత్స కోసం వివిధ రకాల వాహనాల్లో ఆస్పత్రికి వస్తున్నారు. మరోవైపు డాక్టర్లు, సిబ్బంది వందల మంది పనిచేస్తున్నారు. డాక్టర్లు అధికంగా సొంతకార్లలో విధులకు వస్తారు. అయితే వాహనాల పార్కింగ్కు సరైన స్థలం లేకపోవడంతో ఆస్పత్రిలో ఎక్కడ పడితే అక్కడ వాహనాలను నిలిపి వెళుతున్నారు.
మండల పరిధి లోని పులసల నూ తల గ్రామంలో పంచాయతీ ఆధ్వ ర్యంలో ఏర్పాటు చేసిన బోరు, పైపు లైను, స్టార్టర్లను మంగళవారం రా త్రి గుర్తుతెలి యని వ్యక్తులు ధ్వంసం చేశారు. కొద్దిరోజుల క్రితం గ్రామంలో తీవ్రమైన నీటి ఎద్దడి నెలకొంది.
ప్రతి గ్రామంలో భూ సమస్యలు అధికంగా కనిపిస్తున్నాయని, అసైన్డమెంట్ కమిటీలను ఏర్పాటుచేసి వాటిని పరిష్కరిస్తామని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. మండలంలోని వెంకటాపురంలో బుధవారం ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
మండల కేంద్రానికి చెం దిన టీడీపీ కార్యకర్త రామన్నను పోలీసులు కొట్టిన ఘటనలో సీఐ కరుణాకర్ ను వీఆర్ కు పంపుతూ బుధవారం అ నంతపురం రేంజ్ డీఐజీ షిముషి ఆదేశాలు జారీ చేశా రు. డబ్బుల విషయంలో మంగళవారం రాత్రి పెద్దమనిషిగా వెళ్లిన మాజీ సర్పంచ కుటుంబ సభ్యుడు, టీడీపీ కార్యకర్త రామన్నను సీఐ కరుణాకర్ కొట్టారని టీడీపీ కార్యకర్తలు, నేతలు స్థానిక స్టేషన ఎదుట ధర్నా చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ఎస్పీ జగదీష్ విచారణ చేసి డీఐజీ షిముషికి నివేదిక ఇచ్చారు.
ఆ గ్రామానికి తారు రోడ్డు అనేది గ్రామస్థుల ఏళ్లనాటి కల. గ్రామ ఏర్పాటై దాదాపు నాలుగు తరాలు దాటింది. అయినా ఆ గ్రామానికి వెళ్లాలంటే నిత్యం ఒడిదుడుకుల ప్రయాణమే. మట్టిరోడ్డులోని అడుగడుగునా గుంతల్లో గ్రామస్థులు నిత్యం అవస్థల ప్రయాణం సాగించేవారు.
మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు టీడీ జనార్దనకు ఆ పార్టీ నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. మంగళవారం అనంతపురం నగరానికి వచ్చిన ఆయన్ను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వెంకటశివుడు యాదవ్, ఆస్పత్రి అభివృద్ధి కమిటీ సభ్యుడు గంగారామ్, నాయకులు పీఎల్ఎనమూర్తి, పరమేశ్వరన, కడియాల కొండన్న, గోపాల్ గౌడ్, లక్ష్మీనరసింహ, స్వప్న, సంగా తేజస్విని, ఇస్మాయిల్, ఓంకార్రెడ్డి, తాటి మధు, నెట్టెం బాలకృష్ణ, వడ్డే భవానీ, చరిత, అయేషా తదితరులు పుష్పగుచ్చాలు అందజేసి స్వాగతం పలికారు.
ఫాల్గుణ బహుళ ఏకాదశిని పురస్క రించుకుని మంగళవారం సాయంత్రం కొత్తూరు వాసవీ కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అమ్మవారికి నూతన వస్త్రార్చన పూజలను ఘనంగా నిర్వహించారు. దాదాపు వెయ్యి చీరలను అమ్మవారి ఎదుట ఉంచి పూజలు చేశారు.