Home » Anam Ramanarayana Reddy
జిల్లాకు ఎంతో అవసరమైన దగదర్తి విమానాశ్రయ పనులు కూడా త్వరలో ప్రారంభిస్తామని ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, విమానాశ్రయ ఏర్పాటుపై వివిధ శాఖల అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, డాక్టర్ పొంగూరు నారాయణ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఛానల్తో మాట్లాడుతూ ఏపీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. తన నివాసంలో పార్టీ శ్రేణులతో అంతర్గత సమావేశాలు నిర్వహిస్తున్నామని, అయితే వైసీపీ ఎంపీటీసీ ఒకరు స్వామి మాలలో నేరుగా సమావేశంలో చొరపడ్డాడని మంత్రి చెప్పారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నిన్న (శనివారం) సాయంత్రం తన స్వగృహంలో మండలాల వారీ సమావేశాలు చేపట్టారు.
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు జిల్లాలో పరిస్థితిపై జిల్లా కలెక్టర్ ఆనంద్, రెవెన్యూ, పోలీసు అధికారులతో దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు.
Andhrapradesh: ‘‘గత పాలకుల్లాగా మేమూ ఉండాలనుకోవడం మీ మూర్ఖత్వం. క్షమాపణలు చెప్పని వారు సిగ్గుపడాలి’’ అని మండిపడ్డారు. శాస్త్రలు, ధర్మాలకి క్షమాపణలు చెప్పకుండా సవాళ్లు విసురుతున్నారన్నారు. ఆగమ, వైదిక శాస్త్రల అనుసారం తాము నడుచుకుంటామని మంత్రి ఆనం స్పష్టం చేశారు.
Andhrapradesh: టీటీడీ పాలకమండలితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27 వేల దేవాలయాల పాలకమండళ్లను త్వరలోనే నియమిస్తామని ప్రకటించారు. లడ్డు వివాదం ముగిసిన అంశం అని.. తదుపరి సిట్ దర్యాప్తు నిర్వహిస్తుందని తెలిపారు. సిట్ నివేదిక వచ్చిన తరువాత విజిలెన్స్, సిట్ నివేదికలపై ప్రభుత్వం పరిశీలన జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటుందని చెప్పారు.
Andhrapradesh: తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి ప్రసాదమైన లడ్డులో కల్తీ నెయ్యి వాడి గత పాలకుల దోపిడి చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో పరీక్షలు నిర్వహిస్తే నివేదికలలో జంతువుల కొవ్వు ఉందని స్పష్టం చేశాయన్నారు.
Andhrapradesh: తిరుమలలో ఏర్పాట్లు బాగోలేదంటూ శ్రీవారి ఆలయం వద్దే మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డికి భక్తుడు ఫిర్యాదు చేశాడు. నిన్నటి (ఆదివారం) నుంచి క్యూ లైనల్లో వేచి వున్నా స్వామి వారి దర్శన భాగ్యం దక్కలేదన్నారు. అంతేకాకుండా క్యూలైనల్లో అన్నప్రసాదాలు పంపిణీ చేయలేదని తెలిపారు. చిన్న బిడ్డలతో క్యూలైన్లలో వేచి ఉండలేక బయటకు వచ్చేసామంటూ మంత్రికి సదరు భక్తుడు ఫిర్యాదు చేశాడు.
Andhrapradesh: జిల్లా ప్రజలకు దశాబ్ధాల కాలంగా సోమశిల ప్రాజెక్ట్ జీవనాడిగా ఉందని ఏపీ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సోమశిల డ్యాం కెపాసిటీని ఎన్టీఆర్ 78 టీఎంసీలకి పెంచారని తెలిపారు. రాయలసీమ, నెల్లూరు జిల్లాలతో పాటు తమిళనాడు రాష్ట్రానికి నీరందించేలా రూపకల్పన చేశారని గుర్తుచేశారు. జగన్ ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసిందని..
ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanaraya Reddy) తెలిపారు. ఇబ్రహీంపట్నం వద్ద కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద మళ్లీ నవ హారతులను ప్రారంభిస్తామని తెలిపారు.