• Home » Anakapalli

Anakapalli

CM Jagan: రేపు అనకాపల్లిలో సీఎం జగన్ పర్యటన

CM Jagan: రేపు అనకాపల్లిలో సీఎం జగన్ పర్యటన

Andhrapradesh: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రేపు (గురువారం) అనకాపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ చేయూత నాలుగో విడత నిధులను సీఎం విడుదల చేయనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి అనకాపల్లి జిల్లా కశింకోటకు జగన్ చేరుకోనున్నారు.

Bhuvaneshwari: మరికొద్ది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది..

Bhuvaneshwari: మరికొద్ది రోజుల్లో కురుక్షేత్ర యుద్ధం రాబోతుంది..

Andhrapradesh: మరికొద్దిరోజుల్లో కురుక్షేత్ర యుద్ధం రాబోతుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి అన్నారు. గురువారం జిల్లాలోని రావికమతం మండలం, గంపవాని పాలెం గ్రామంలో ‘‘నిజం గెలవాలి’’ కార్యక్రమంలో భువనేశ్వరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను తట్టుకోలేక గుండెపోటుతో చనిపోయిన కార్యకర్తల ఇంటికి వచ్చి ఓదార్చారు. అనంతరం భువనమ్మ మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచకాలు పెరిగిపోతున్నాయని... టీడీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని మండిపడ్డారు.

AP News: బెల్ట్ షాపుల వేలంపై దండోరా.. సోషల్ మీడియాలో వైరల్

AP News: బెల్ట్ షాపుల వేలంపై దండోరా.. సోషల్ మీడియాలో వైరల్

Andhrapradesh: అనకాపల్లి జిల్లాలో ఇసుక, బెల్ట్ షాపుల నిర్వాహకులు బరితెగుంపులకు పాల్పడ్డారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా ఇసుక, అనధికార బెల్ట్ షాపుల వేలంపాటపై దండోరా వేయించారు. ఈ దండోరా దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

YCP: ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వైసీపీ చోటా నేతలు

YCP: ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన వైసీపీ చోటా నేతలు

అనకాపల్లి జిల్లా: కె.కోటపాడు మండలం, కె.సంతపాలంలో ప్రభుత్వ భూమిని స్థానిక వైసీపీ చోటా నేతలు కబ్జా చేశారు. కోట్ల రూపాయల విలువచేసే 60 సెంట్ల గ్రామ కంటాన్ని కబ్జా చేసి కంచి వేశారు.

AP Politics: వారి చెంప పగలగొట్టండి.. నాగబాబు సంచలన కామెంట్స్

AP Politics: వారి చెంప పగలగొట్టండి.. నాగబాబు సంచలన కామెంట్స్

Janasena Leader Nagababu: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో జనసేన నేతలు సైతం దూకుడు పెంచుతున్నారు. ముఖ్యంగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు.. అధికార పార్టీ నేతలపై ఫైర్ అవుతున్నారు. తాజాగా అనకాపల్లిలో పర్యటించిన నాగబాబు.. స్థానిక మంత్రిపై సంచలన ఆరోపణలు చేశారు.

Chandrababu: బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?...

Chandrababu: బటన్‌ నొక్కుడు కాదు.. నీ బొక్కుడు సంగతేంటి?...

64 రోజుల్లో టీడీపీ- జనసేన ప్రభుత్వం రాబోతుందని, ఈ ఎన్నికలు ఏపీ ప్రజల భవిష్యత్‌ కోసమని, ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి.. ప్రజలు గెలవాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. రాష్ట్రంలో సైకో పాలన అంతం చేస్తే తప్ప భవిష్యత్‌ లేదని, సైకో సీఎంను తన జీవితంలో ఎప్పుడూ చూడలేదని ఆయన అన్నారు.

Crime News: అనకాపల్లి జిల్లాలో విషాదం..

Crime News: అనకాపల్లి జిల్లాలో విషాదం..

అనకాపల్లి జిల్లా: పాయకరావుపేట మండలం, పెద్దరామభద్రపురంలో విషాదం నెలకొంది. రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ.. కొట్లాటకు దారితీసింది. ఈ క్రమంలో జరిగిన కొట్లాటలో గంపల నూకరాజు అనే వ్యక్తికి తీవ్రంగా గాయపడ్డాడు.

YV Subbareddy: షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే..

YV Subbareddy: షర్మిల పార్టీ కాంగ్రెస్‌లో విలీనంపై వైవీ సుబ్బారెడ్డి ఏమన్నారంటే..

Andhrapradesh: కాంగ్రెస్‌లో వైఎస్ షర్మిల పార్టీ విలీనంపై వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీలో అవకాశం లేకే షర్మిల తెలంగాణలో కొత్త పార్టీ పెట్టుకుందన్నారు. అక్కడ ఉన్న రాజకీయ పరిస్థితులను బట్టి కాంగ్రెస్‌లో విలీన నిర్ణయం తీసుకున్నారని తెలిపారు.

YuvaGalam Padayatra: యాదవులతో లోకేష్ ముఖాముఖి

YuvaGalam Padayatra: యాదవులతో లోకేష్ ముఖాముఖి

Andhrapradesh: యలమంచిలి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఇందులో భాగంగా జీవీఎంసీ 82వ వార్డులో యాదువలతో లోకేష్ ముఖాముఖి నిర్వహించారు.

Lokesh YuvaGalam: 224వ రోజు యువగళం పాదయాత్రలో లోకేష్‌ను ఎవరెవరు కలిశారంటే..?

Lokesh YuvaGalam: 224వ రోజు యువగళం పాదయాత్రలో లోకేష్‌ను ఎవరెవరు కలిశారంటే..?

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర అనకాపల్లి జిల్లాలో దూసుకెళ్తోంది. పాదయాత్ర చేస్తున్న లోకేష్‌ను వివిధ వర్గాల ప్రజలు కలిసి తమ తమ సమస్యలను చెప్పుకుంటున్నారు. ఈరోజు యలమంచిలి నియోజకవర్గం తిమ్మరాజుపేట నుంచి 224వ రోజు యువగళం పాదయాత్రను యువనేత ప్రారంభించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి