Home » Amaravati farmers
రాష్ట్రంలో భారీ వర్షాల నేపథ్యంలో యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని, సమస్యలను తమ దృష్టికి తీసుకురావాలని విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు.
అమరావతి: రాజధాని రైతులు ఆదివారం తెల్లవారు జామున విజయవాడ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి కాలినడకన బయలుదేరారు. తుళ్లూరు నుంచి మహిళా రైతులు, రైతులు, రైతు కూలీలు పొంగళ్ళు నెత్తిన పెట్టుకొని అమ్మవారి గుడికి బయలుదేరారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం రావడంతో అమరావతి నిర్మాణం సాకారం అవుతుండడంతో రాజధాని గ్రామాల రైతులు తమ మొక్కులను చెల్లించుకోనున్నారు.
ఆంధ్రప్రదేశ్లో ఎన్డీయే ప్రభుత్వం(NDA government) అధికారంలోకి రావడంతో విజయవాడ(Vijayawada) కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు అమరావతి రైతులు(Amaravati Farmers) ఆదివారం తెల్లవారుజామున 4గంటలకు కాలినడకన బయలుదేరనున్నారు. ఈ కార్యక్రమంలో 29గ్రామాల రైతులు, మహిళా రైతులు, రైతు కూలీలు పెద్దఎత్తున పాల్గొననున్నారు.
ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్తున్న సీఎం చంద్రబాబు(CM Chandrababu)కు అమరావతి రైతులు(Amaravati farmers) అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. దారి పొడవునా పూలు చల్లి మహిళలు హారతులు పట్టారు.
ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఏర్పాటుతో రాజధాని గ్రామాలలో సందడి వాతావరణం నెలకొంది. రాజధాని కోసం భూమిచ్చిన రైతులు దాదాపు ఐదేళ్ల పాటు తమ పోరాటాన్ని కొనసాగించారు. వైసీపీ ప్రభుత్వం కారణంగా నానా ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయంతో రాజధాని గ్రామాల్లోని రైతులంతా పెద్ద ఎత్తున సంబరాలు చేసుకుంటున్నారు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ప్రభుత్వం మారడంతో రాజధాని అమరావతి రైతులు, ప్రజలు సంబురాలు చేసుకున్నారు. ఎన్డీఏ కూటమి భారీ విజయం సాధించడంతో రైతులు మళ్లీ అమరావతిని రాజధానిగా చేస్తారని భావిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూడా ప్రమాణ స్వీకారాన్ని కూడా అమరావతిలోనే చేస్తారనే వార్తలు వస్తున్నాయి.
ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ పాపాలు ఈ నెల 4వ తేదీతో పండనుందని అమరావతి రైతు ఆలూరి శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఇంతటితో ఆయన పరిపాలన అంతమవుతుందని ఆయన స్పష్టం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇటువంటి ముఖ్యమంత్రిని తాము ఎన్నడూ చూడలేదన్నారు.
రాష్ట్రాన్ని విభజించి పదేళ్లు పూర్తయింది. సర్వం కోల్పోయిన అవశేష ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా నిలబెట్టేందుకు కేంద్రం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సంపూర్ణంగా అమలు కాలేదు.
సాధారణంగా పరిశ్రమల స్థాపన కోసమో, ఇతర అవసరాల కోసమో ప్రభుత్వం రైతుల నుంచి భూములు సేకరిస్తుంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. కొత్త విషయం ఏంటంటే.. ఓ ప్రైవేటు వ్యక్తి గ్రామాలకు గ్రామాలనే తన వశం చేసుకుంటున్నాడు.
రాష్ట్ర రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోయారు. తలసరి రుణ భారంలో రాష్ట్ర రైతులు దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారు. రాష్ట్రంలో ఒక్కో రైతు కుటుంబంపై రూ.2,45,554 అప్పు పేరుకుంది.