Home » Allu Arjun
తెలంగాణలో బెనిఫిట్షోలకు అనుమతి ఇవ్వబోమని, టికెట్ ధరల పెంపును అనుమతించబోమని చెప్పారు. తాజాగా ఏపీ, తెలంగాణ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ నాయకులు సమావేశమై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.బెనిఫిట్ షోలకు ప్రభుత్వం అనుమతి ఇవ్వకూడదన్నారు. బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని థియేటర్స్ యాజమాన్యం స్వాగతించింది. ప్రీమియర్ షోలకు..
సంధ్యా ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. తెలంగాణ హై కోర్టు మధ్యంతర బెయిల్ ఇవ్వడంతో చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి బన్నిని విడుదల చేశారు. అయితే ఎపిసోడ్ కీలక ములుపులు తిరుగుతోంది.
సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్ నిర్లక్ష్యం ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంపై శాసనసభలో మాట్లాడారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ లేవనెత్తిన ప్రశ్నకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానమిస్తూ ఓ మహిళ చనిపోయిందని, థియేటర్ నుంచి నటుడు అల్లు అర్జున్ వెళ్లిపోవాలని..
Andhrapradesh: అల్లు అర్జున్ వివాదంపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. అల్లు అర్జున్ అరెస్ట్ అయితే చాలామంది ఆయనను పరామర్శించారని.. మరి చనిపోయిన మహిళ కుటుంబాన్ని ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. బెన్ఫిట్ షోలు వెయ్యాలనుకుంటే తప్పనిసరి పోలీస్ అనుమతి తీసుకోవాలన్నారు.
సంధ్య థియేటర్ ఘటనలో రేవతి మృతిని నిరసిస్తూ నిన్న (ఆదివారం) ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన నిందితులకు కోర్టు రిమాండ్ విధించింది. అల్లు అర్జున్ ఇంటిపై ఓయూ జేఏసీ నేతలు శ్రీనివాస్, మోహన్, నాగరాజు, నరేశ్, ప్రేమ్ కుమార్, ప్రకాశ్ దాడి చేశారు.
పుష్ప-2 విడుదల సందర్భంగా జరిగిన దుర్ఘటన నేపథ్యంలో బెనిఫిట్ షోలను రద్దు చేయడం సరికాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
సినీ హీరో అల్లు అర్జున్ను అరెస్టు చేయడం కరెక్టు కాదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పేర్కొన్నారు.
సినీ హీరో అల్లు అర్జున్ నివాసంపై రాళ్ల దాడి జరగడం శాంతి భద్రతల వైఫల్యమేనని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
సినీ హీరో అల్లు అర్జున్ను అరెస్టు చేయడం సరికాదని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి పేర్కొన్నారు. ఆదివారం ప్రకాశం జిల్లా ఒంగోలులో ఆమె విలేకరులతో మాట్లాడారు.
అల్లు అర్జున్ వల్ల చనిపోయిన రేవతి కుటుంబానికి.. ఆయన తక్షణమే కోటి రూపాయలు చెల్లించాలని ఓయూ జేఏసీ డిమాండ్ చేసింది.