Home » Allu Arjun
Sandhya Theatre Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ను దిల్ రాజు పరామర్శించారు. రేవతి కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలిపారు.
Sandhya Theater Stampede Case: సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుల వివరాలను పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై ఎవరిపై ఎలాంటి కేసులు పెట్టారు అనే వివరాలు ప్రకటించారు. సంధ్య థియేటర్ తొక్కీసలాట ఘటనలో ఏ1గా..
అల్లు అర్జున్ కేసు విషయంలో హైకోర్టు సీనియర్ న్యాయవాది పాదూరి శ్రీనివాస్ రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. ప్రెస్మీట్ పెట్టి మరీ.. ఈ వ్యవహారంపై తీవ్ర ఆరోపణలు చేశారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు తన తండ్రి అల్లు అరవింద్తో కలిసి అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్స్టేషన్కు వచ్చారు. అల్లు అర్జున్ లాయర్, మామ చంద్రశేఖర్ రెడ్డి, బన్నీ వాసు కూడా చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు వచ్చారు. ఆ విచారణలో అల్లు అర్జున్ను మధ్యాహ్నం 2.47 గంటల వరకు విచారించారు.
Allu Arjun: చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో అల్లు అర్జున్ విచారణ ముగిసింది. మూడు గంటలు పాటు విచారణ చేసిన పోలీసులు.. అల్లు అర్జున్ను 20 ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది.
నటుడు అల్లు అర్జున్ ఎపిసోడ్లో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి రాజకీయం చేస్తున్నారని మెదక్ ఎంపీ రఘు నందన్ రావు విమర్శించారు. ప్రభుత్వం రేవంత్ చేతిలో ఉందని... బాధితులకు ఏం అనుకుంటే అది చేయొచ్చని అన్నారు.
మొదట అల్లు అర్జున్కు 18 ప్రశ్నలతో కూడిన ఓ పేపర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. వాటికి రాతపూర్వకంగా సమాధానం ఇచ్చిన తర్వాత ఆయనను మరిన్ని ప్రశ్నలు మౌఖికంగా అడిగే అవకాశం ఉండొచ్చు. విచారణలో అల్లు అర్జున్ వాంగ్మూలాన్ని పోలీసులు..
సినీ నటుడు అల్లు అర్జున్ ఈరోజు మరోసారి సంధ్య థియేటర్కు వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పోలీసుల విచారణకు హాజరైన ఆయనను సీన్ ఆఫ్ అఫెన్స్ కోసం సంధ్య థియేటర్కు తీసుకెళ్లే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
అల్లు అర్జున్ ఎపిసోడ్ రోజుకో మలుపు తిరుగుతోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందడం కలకలం రేపింది. ఈకేసులో అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చిన పోలీసులు.. తాజాగా విచారణకు హాజరుకావాలంటూ ఆయనకు నోటీసులు జారీచేశారు. దీంతో అల్లు అర్జున్ మంగళవారం చిక్కడపల్లి పోలీసుల ముందు విచారణకు హాజరుకానున్నారు.
సినీ హీరో అల్లు అర్జున్ మామ.. కాంగ్రెస్ పార్టీ నేత కంచర్ల చంద్రశేఖర్రెడ్డి సోమవారం గాంధీభవన్లో మెరిశారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీని కలిసి మాట్లాడారు.