Home » Allu Arjun
పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో తొక్కిసలాట ఘటనకు సంబంధించిన కేసులో అరెస్టు అయిన అల్లు అర్జున్ను 14 రోజుల పాటు రిమాండ్కు పంపాలని గురువారం నాంపల్లి కోర్టు ఆదేశించింది.
పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుడు, సినీ హీరో అల్లు అర్జున్కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ప్రసాదించింది.
సినిమాలో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తూ పోలీసులకు చిక్కకుండా సవాలు విసిరే పుష్పరాజ్.. నిజ జీవితంలో మాత్రం జైలుకు వెళ్లాల్సి వచ్చింది. వెండితెరపై ‘తగ్గేదేలే’ అంటూ మేనరిజం ప్రదర్శించిన నటుడు చట్టం ముందు తగ్గాల్సివచ్చింది.
పుష్ప-2 సినిమా విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట, అల్లు అర్జున్ అరెస్టు తదితర వివరాలపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. ఈ మేరకు పోలీస్ బందోబస్తు కోరిన నాటి నుంచి నేటి(శుక్రవారం) వరకూ జరిగిన పరిణామాలను వివరిస్తూ సెంట్రల్ జోన్ డిప్యూటీ కమిషనర్, హైదరాబాద్ సిటీ పేరిట ఓ ప్రెస్ నోట్ విడుదల అయ్యింది.
సినిమా కోసం వెళ్లి తొక్కిసలాటలో రేవతి అనే మహిళ ప్రాణాలు కోల్పోవడం అత్యంత బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. దీనికి అసలు కారకులు, రాష్ట్ర పాలకులేనని ఆయన ఆరోపించారు. చర్యలు తీసుకోవాల్సింది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వంపైనే అని ఆయన అన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టుపై వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి స్పందించారు. అల్లు అర్జున్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు జగన్ చెప్పారు. హైదరాబాద్ సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో మహిళ మృతిచెందడం దురదృష్టకరమని ఆయన అన్నారు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు గురించి తెలుసుకున్న ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు బయలుదేరారు. మరికాసేపట్లో ఆయన హైదరాబాద్కు చేరుకుని అల్లు అర్జున్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.
క్వాష్ పిటిషన్పై విచారణను వాయిదా వేస్తూ తక్షమే బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తి ఈ పిటిషన్పై అత్యవసర విచారణ జరపాలని అల్లు అర్జున్ తరపున న్యాయవాది కోరగా.. కేసుపై సోమవారం విచారణ జరపాలని, అత్యవసర విచారణ అవసరం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది వాదించారు.
టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ విషయంలో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన నేపథ్యంలో మృతురాలి భర్త మాట్లాడుతూ కేసు ఉపసంహరించుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే ఎందుకు అలా చెప్పారనే వివరాలను ఇక్కడ తెలుసుకుందాం.
దేశంలో ఎంతోమంది ప్రముఖ వ్యక్తులు ఇప్పటివరకు అరెస్టై రిమాండ్ ఖైదీలుగా, ఖైదీలుగా శిక్షను అనుభవించారు. వీరిలో సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు వివిధ రంగాలకు చెందిన ప్రముఖ వ్యక్తులు ఉన్నారు. రిమాండ్ ఖైదీ విషయంలో జైలు అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తారు. ముఖ్యంగా వీఐపీల విషయంలో మరింత అప్రమత్తంగా ఉంటారు. రిమాండ్ ఖైదీకి ఎలాంటి ఇబ్బంది కలిగినా జైలు అధికారులు కోర్టులో బాధ్యత వహించాల్సి వస్తుంది. దీంతో వీఐపీల విషయంలో..