Home » Akhilesh Yadav
సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అభిలేష్ యాదవ్ పార్లమెంట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా హక్కులను కాలరాస్తున్నారని, ఆయన కోసం ప్రతిపక్షాలు పోరాడాల్సి వస్తోందని ఆరోపించారు.
భారత మహిళా రెజ్లర్ వినేష్ ఫోగట్పై పారిస్ ఒలింపిక్స్లో అనర్హత వేటు పడటంపై దేశంలో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఈ విషయంపై కేంద్రప్రభుత్వాన్ని ఇండియా కూటమి పక్షాలు లక్ష్యంగా చేసుకున్నాయి. వినేష్ అనర్హతపై విపక్షాలు పార్లమెంట్లో ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి.
వక్ఫ్ చట్టంలో పలు సవరణలకు కేంద్ర సమయాత్తమవుతుండటంపై ఉత్తప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పందించారు. వక్ఫ్ బోర్డుల అపరిమిత అధికారాలకు కళ్లెం వేస్తూ "వక్స్ లా-1995'ను సవరిచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను తమ పార్టీ వ్యతిరేకిస్తుందని తెలిపారు. ముస్లింల హక్కులను హరిచేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
అయోధ్యలో పన్నెండేళ్ల మైనర్ బాలికపై ఆత్యాచార ఉదంతం వెలుగుచూడటంతో బాధితురాలి కుటుంబాన్ని బీజేపీ ప్రతినిధి బృందం ఆదివారంనాడు పరామర్శించింది. అత్యాచారానికి పాల్పడిన నిందితుల్లో సమాజ్వాదీ పార్టీ నేత ఒకరు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి.
ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్ ఫలితాలు సమాజ్వాదీ పార్టీకి సంతోషానిచ్చాయి. వూహించినదానికంటే ఎక్కువ సీట్లు రావడం, బీజేపీ బలంగా ఉన్నచోట్ల ఓడిపోవడంతో కమలం బలం తగ్గుతుందని.. ఎస్పీ బలం పెరుగుతుందనే అంచనాకు అఖిలేష్ యాదవ్ వచ్చినట్లు తెలుస్తోంది.
పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం రోజే 'నీట్' పేపర్ లీక్ అంశంపై అధికార పక్షాన్ని విపక్షాలు నిలదీశాయి. పేపర్ లీక్ అనేది తీవ్రమైన సమస్య అని, దీనికి విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలని విపక్ష నేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. దీనికి మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సమాధానమిస్తూ, ప్రభుత్వానికి ఎలాంటి దాపరికారాలు లేవని అన్నారు.
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మోసపూరిత ఎత్తుగడలతో అధికారం నిలబెట్టుకుంటోందని, త్వరలోనే ఆ ప్రభుత్వ కప్పుకూలుతుందని సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ జోస్యం చెప్పారు. పశ్చిమబెంగాల్లోని కోల్కతాలో ఆదివారంనాడు జరిగిన టీఎంసీ ధర్మ్తలా ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, అడ్డదారులు తొక్కయినా అధికారాన్ని కైవసం చేసుకోవాలని కేంద్రలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు.
ఉత్తపరప్రదేశ్ బీజేపీలో 'లుకలుకలు' తలెత్తాయంటూ ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ పరోక్షంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్యకు ఇచ్చిన 'మాన్ సూన్ ఆఫర్'ను ఆయన అంతే వేగంగా తిప్పికొట్టారు. మీ మాన్సూన్ ఆఫర్కు 2027లో ప్రజలే గట్టి జవాబు ఇస్తారంటూ కౌంటర్ ఇచ్చారు.
భారతీయ జనతా పార్టీ (BJP)పై సమాజ్ వాదీ పార్టీ (SP) అధినేత అఖిలేష్ యాదవ్ మండిపడ్డారు. బయటి వ్యక్తులు అయోధ్యకు వచ్చి పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేశారని, లాభాలు పొందడానికే ఇదంతా చేశారని ఆరోపించారు. ఇతర ప్రాంతాల వ్యక్తులు అయోధ్యలో భూమి కొనడంవల్ల స్థానికులకు ఎలాంటి ప్రయోజనం కలగలేదన్నారు.
పార్లమెంటులో ఈవీఎంల అంశం మరోసారి ప్రస్తావనకు వచ్చింది. ఈవీఎంల విశ్వసనీయతను సమాజ్వాదీ పార్టీ చీఫ్, కన్నౌజ్ ఎంపీ అఖిలేష్ యాదవ్ లోక్సభలో మంగళవారం ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్లో తమ పార్టీ 80 సీట్లు గెలిచినా సరే తాను ఈవీఎంలను నమ్మేది లేదని అన్నారు.