Home » Airport
ఢిల్లీ నుంచి బెంగళూరు రావాల్సిన విమానం పైలెట్ల కొరత కారణంగా ఢిల్లీ విమానాశ్రయంలో టేకాఫ్ కాకుండానే నిలిచిపోయింది.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈనెల 5న తొలిసారి హైదరాబాద్కు చంద్రబాబు రానున్నారు. దీంతో ఏపీ సీఎంకు పెద్దఎత్తున వెల్కమ్ చెప్పేందుకు టీటీడీపీ శ్రేణులు సిద్ధమవుతున్నారు. ఈనెల 5వ తేదీ సాయంత్రం 4గంటలకు బేగంపేట్ విమానాశ్రయంలో చంద్రబాబుకు ఘనస్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పొలిట్ బ్యూరో సభ్యుడు అర్వింద్ కుమార్ గౌడ్ తెలిపారు.
భారీ వర్షాల(Heavy Rains) కారణంగా ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(International Airport) కూలిన ఘటనపై ప్రతిపక్షాలు అనవసర ఆరోపణలు చేస్తున్నాయని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్ మోహన్ నాయుడు (Ram Mohan Naidu) విమర్శించారు.
లక్ష మందికి ప్రత్యక్షంగా, మరో 4 లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఏర్పాటైన కాకతీయ మెగా టెక్స్టైల్ పార్కుపై మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. ఈ పార్కులో 200కుపైగా వస్త్ర కంపెనీలు ఏర్పాటవుతాయని చెప్పిన గత ప్రభుత్వం..
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో టెర్మినల్ వన్ విమానశ్రయంలో పైకప్పు కూలిన ఘటనపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. పైకప్పు కూలిన ఘటనపై వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నానని ఎక్స్లో వెల్లడించారు.
దేశరాజధానిలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఢిల్లీ(delhi)లోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్ 1లో కొంత పైకప్పు భాగం కుప్పకూలింది. కూలిన ప్రాంతం రోడ్డుపై పడటంతో అటుగా వచ్చిన పలు కార్లు తీవ్రంగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృత్యువాత చెందగా, మరో ఎనిమిది మంది గాయపడ్డారు.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ (Shamshabad Airport) పార్కింగ్లో యువకుడు కత్తితో హల్చల్ చేశాడు. మహిళను బెదిరించి ఆమె కారును దొంగిలించాడు. ఈ ఘటనతో ఆమె ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైంది.
బంగారాన్ని కరిగించి పేస్టుగా మార్చి.. అక్రమంగా తరలిస్తుండగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం(Shamshabad International Airport)లో కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ ప్రయాణికుడు అబుదాబి నుంచి మంగళవారం తెల్లవారుజామున శంషాబాద్ ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు.
రంగారెడ్డి జిల్లా శంషాబాద్(Shamshabad) మండల పరిధిలోని ఘన్సిమియాగూడలో పులి కలకలంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. దాంతో సోమవారం జిల్లా ఫారెస్ట్ అధికారి సుధాకర్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది మండల పరిధిలోని ఘన్సిమియాగూడ, శంకరపురం పరిసరాల్లో పులి ఆనవాళ్ల(పాదముద్రలు)ను గుర్తించారు.
హైదరాబాద్: శంషాబాద్లో ప్రతిక్ అనే విద్యార్థి అదృశ్య మయ్యాడు. ఎయిర్ పోర్టులోని చిన్మయా స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన విద్యార్థి.. ఇంటిలో పుస్తకాల బ్యాగ్ పెట్టీ.. బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో..