Home » Agrigold Scam
గత వైసీపీ ఐదేళ్ల పాలనలో రౌడీయిజం చేసిన మాజీ మంత్రి జోగి రమేశ్ ఇవాళ నీతులు చెబుతున్నారని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో అడ్డగోలుగా తప్పుడు పనులు చేసి ఇప్పుడు అడ్డంగా దొరికిపోయాక కులప్రస్తావన తెస్తున్నారంటూ అనగాని ఆగ్రహం వ్యక్తం చేశారు. అగ్రిగోల్డ్ వ్యవహారంలో ఫిర్యాదులు వచ్చాకే ఏసీబీ అధికారులు చర్యలు చేపట్టారని మంత్రి చెప్పుకొచ్చారు.
అగ్రిగోల్డ్ స్కామ్ గంటగో మలుపు తిరుగుతోంది. మంగళవారం ఉదయం నుంచి వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ ఇంట్లో సోదాలు చేసిన ఏసీబీ అధికారులు.. ఆయన కుమారుడు జోగి రాజీవ్ను అరెస్ట్ చేయడం జరిగింది. ఈ స్కామ్లో రాజీవ్ కీలక పాత్ర పోషించారని చెప్పిన ఏసీబీ (AP ACB) అధికారులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు...