Home » Agriculture
వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. పంటల కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రతిరోజూ రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్రకేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేంద్రమంత్రులతో ప్రధాని చర్చించారు.
రొయ్యల ఫీడ్ ధరలను కొన్ని ఫీడ్ కంపెనీలు పెంచడంపై ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో చర్చించకుండా ధరలు పెంచడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.
గజపతినగ రం దావాలపేట పరిధిలోగల మహంకాళీ అమ్మవారి గుడి సమీ పంలో పురుగు మందు తాగి, చికిత్స పొందుతూ ఒకరు మృతిచెందారు.
రైతులందరూ ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి పెట్టాలని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రసాయనాల వాడకాన్ని తగ్గించకపోతే వ్యవసాయమే ప్రశ్నార్థకంగా మారుతుందని పేర్కొన్నారు.
వర్ధన్నపేట మండలం ఇల్లందలోని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ఎదుట జాతీయ రహదారిపై అన్నదాతలు గురువారం ధర్నా చేపట్టారు. తెలంగాణ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయట్లేదని ఆగ్రహించిన రైతులు రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు.
ధాన్యం రవాణాపై తెలంగాణ రవాణా శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. వరి ధాన్యం తరలింపునకు వాహనాలను సమీకరించాలని ఆదేశించింది. ఈ మేరకు జిల్లా రవాణా అధికారులకు ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు.
రైతులకు చేదోడువాదోడుగా నిలుస్తున్న యాంత్రీకరణ ప్రక్రియ మంగళవారం నుంచి మొదలైంది. కూలీల కొరతను అధిగమించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్నాళ్లుగా యంత్రపరికరాలను అందిస్తున్నాయి.
ప్రత్తిపాడు ప్రాంతానికి గుంటూరు ఛానల్ చాలా ముఖ్యమైనదని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యాఖ్యానించారు. గుంటూరు ఛానల్లో ప్లో లేకపోవడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహిస్తూ అనేక పథకాలు తీసుకొస్తున్నా వాటిపై అవగాహన లేకపోవడంతో రైతులు వినియోగించుకోలేకపోతున్నారు. ఈక్రమంలోనే ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజులపాటు వివిధ అంశాలపై కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన తెలంగాణ ప్రభుత్వం ఈవారం ‘రైతు వారం’గా కార్యక్రమాల నిర్వహణకు కార్యాచరణ రూపొందించింది.