Home » Adilabad District
బాసర రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో (బాసర ట్రిపుల్ ఐటీ) అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్ విడుదల అయ్యింది. జూన్ 1నుంచి దరఖాస్తుల ప్రక్రియ మెదలై జూన్ 22తో ముగిస్తుంది.
హైదరాబాద్: మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కొమురం భీం జిల్లాల్లో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే ముగియనుంది. మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో పోలీసులు గట్టి నిఘా ఏర్పాటు చేశారు. ప్రత్యేక పోలీస్ బలగాలు పహారా కాస్తున్నాయి.
తెలంగాణలో 10 లోక్సభ స్థానాల్లో బీజేపీ జెండా విజయ కేతనం ఎగుర వేస్తుందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కాగజ్నగర్లో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించారు. తెలంగాణలో బీజేపీ ఓట్ల శాతం పెరిగిందన్నారు.
ఆదిలాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల పర్వం ప్రారంభం కానుండటంతో అన్ని పార్టీల అభ్యర్థులు ముహూర్తాలు చూసుకుని నామినేషన్లు వేస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు.
ముఖ్యంగా సెల్ఫోన్ వినియోగం పెరిగిన తర్వాత పక్క ఇంటి వారి విషయం పక్కనబెడితే మన ఇంట్లోని వారినే పట్టించుకోని పరిస్థితులు ఉన్నాయి. ఇంట్లో పది మంది ఉన్నా కూడా తలొక ఫోన్ పట్టుకుని కూర్చుంటున్నారు తప్ప ఒకరితో ఒకరు సరదాగా గడుపుతున్నదే లేదు.
పార్లమెంట్ ఎన్నికల్లో ఓటర్లందరూ తమ ఓటు హక్కును నిర్భయంగా వినియోగించుకోవాలని బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ అన్నారు. ప్రలోభాలకు గురికాకుండా ఇష్టమైన నాయకుడికి ఓటువేయలని కోరారు. మంగళవారం సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు.
కొమురంభీం: జిల్లాలో ఏనుగు అలజడి సృష్టించింది. చింతల మానేపల్లి మండలం, బూరెపల్లి శివారులో ఏనుగు దాడిలో రైతు మృతి చెందాడు. దీంతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళన చెందుతున్నారు. మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి కొమురంభీం జిల్లాలోకి ఏనుగు ప్రవేశించింది.
Telangana Elections: తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలపై బీఆర్ఎస్ ప్రత్యేక దృష్టి సారించింది. అసెంబ్లీ ఎన్నికల్లో అట్టర్ ప్లాప్ అయ్యాక.. పార్లమెంట్ ఎన్నికల్లో అయినా పరువు కాపాడుకోవాలని శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం కచ్చితంగా ఆశించిన సీట్లను దక్కించుకోవాలని వ్యూహరచన చేస్తోంది. ఇందులో భాగంగానే ఎంపీ అభ్యర్థుల విషయంలో ఆచితేచి అడుగులు వేస్తోంది. ఇప్పటికే పలువురు ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్.. తాజాగా మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు...
Telangana: జిల్లాలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన కొనసాగుతోంది. సోమవారం ఉదయం జిల్లాకు చేరుకున్న ప్రధానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో నిర్వహించిన సభలో మోదీ పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. రామగుండం ఎన్టీపీసీ పవర్ ప్లాంట్ ప్రధాన మంత్రి జాతికి అంకితం చేశారు.
ఆదిలాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పర్యటించనున్నారు. ముందుగా కేస్లాపూర్లో నాగోబాను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయనున్నారు.