Home » ACB
ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో నిందితులకు బుధవారం రిమాండ్ ముగిసింది. రిమాండ్ ముగియడంతో వైసీపీ రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని విజయవాడ ఏసీబీ కోర్టుకు రాజమండ్రి పోలీసులు తరలించారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో మిథున్రెడ్డి ఉన్న విషయం తెలిసిందే.
తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించేందుకు లంచాలు తీసుకున్న ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఓ ప్రైవేటు సర్వేయర్ వేర్వేరు ఘటనల్లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు.
మారుమూల గ్రామంలో ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి.
ఒకే రోజు ఏసీబీ వలకు ఇద్దరు అధికారులు చిక్కారు. ఈ నెలాఖరున పదవీ విరమణ చేయబోతున్న జగిత్యాల జిల్లా రవాణాశాఖ అధికారి (డీటీవో) భద్రునాయక్ బుధవారం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు.
ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణం ద్వారా పట్టుబడిన రూ.11 కోట్లు బ్యాంకులో సిట్ అధికారులు శనివారం డిపాజిట్ చేశారు. ఆ నోట్లను వీడియో తీయాలని, విడిగానే ఉంచాలని ఏసీబీ కోర్టులో రాజ్ కసిరెడ్డి తరపు న్యాయవాదులు పిటీషన్ వేశారు.
ప్రభుత్వ కార్యాలయాలకు పని నిమిత్తం వచ్చే వారిని లంచాలు అడుగుతున్న అక్రమార్కులకు ఏసీబీ గట్టి షాక్ ఇస్తోంది. జూలైలో ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి పలువురు లంచగొండుల ఆటకట్టించింది.
మద్యం కుంభకోణం కేసులో 12 మంది నిందితులు శుక్రవారం ఏసీబీ కోర్టులో హాజరయ్యారు. తమకు బెయిల్ కావాలని వీరు న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు. నిందితులు వేసిన పిటిషన్లపై న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. నిందితుల పిటిషన్లని కోర్టు వాయిదా వేసింది. ఈ సందర్భంగా 12 మంది నిందితులకు ఈనెల13వ తేదీ వరకు ఏసీబీ కోర్టు రిమాండ్ పొడిగించింది.
నీటిపారుదల శాఖ విశ్రాంత ఇంజనీర్ చీటి మురళీధర్ రావు అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు గురువారం బ్యాంకు లాకర్లను పరిశీలించారు.
వైసీపీ ఎంపీ మిథున్రెడ్డి లాయర్లు ఏసీబీ కోర్టులో గురువారం బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లిక్కర్ స్కాం కేసులో ఏ4గా మిథున్రెడ్డి ఉన్నారు.
రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాడులు, సోదాలు కొనసాగుతున్నా.. లంచాలకు అలవాటు పడిన అధికారుల తీరు మారట్లేదు. 16 గుంటల భూమికి పట్టా పాస్ బుక్ జారీ చేసేందుకు రూ.2 లక్షలు లంచం డిమాండ్..