Home » AAP
ఇదీ సొంతంగా మేం సాధించిన ఘనత అని ఓటర్లకు చెప్పుకొనేందుకు ఏమీలేదు..! పదేళ్ల కిం దటి ‘మనవాడు ఒకరు తొలిసారి దేశ ప్రధాని కాబోతున్నాడు’ అనే వేవ్ కూడా లేదు..! ఐదేళ్లక్రితం నాటి జాతీయవాద ఉధృత పవనాలూ లేవు..! అలాగని వ్యతిరేకత ఏమీ కనిపించడం లేదు..! ఇదీ గుజరాత్లో ప్రస్తుతం బీజేపీ పరిస్థితి..!
బీసీసీఐ ఛైర్మన్ జై షాపై ఆమ్ ఆద్మీ పార్టీ తారాస్థాయిలో విమర్శలు గుప్పించింది. క్రికెట్ ఎలా ఆడాలో తెలియకపోయినా.. బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనయుడు జై షా బీసీసీఐలో ఉన్న స్థానంలో ఉన్నాడని..
పార్లమెంట్ ఎన్నికల వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి బిగ్ రిలీఫ్ కలిగింది. ఆ పార్టీ నేత, ఎమ్మెల్యే దిలిప్ పాండే రాసి, పాటిన పాటకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ఆ పాటకు మార్పులు చేయడంతో ఈసీ ఎన్నికల్లో వాడుకునేందుకు అంగీకరించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్(CM Arvind Kejriwal) ఓ పక్క జైలు శిక్ష అనుభవిస్తుండగా.. ఆమ్ ఆద్మీ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆప్ ప్రభుత్వం నియమించిన 223 మంది ఉద్యోగులను తొలగిస్తూ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా(VK Saxena) సంచలన నిర్ణయం తీసుకున్నారు.
లోక్సభ ఎన్నికల వేళ కాంగ్రెస్(Congress) పార్టీకి వరుస షాక్లు కలవరపెడుతున్నాయి. తాజాగా ఢిల్లీకి చెందిన ఇద్దరు పరిశీలకులు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
లోక్సభ ఎన్నికల ప్రచారం కోసం 'ఆమ్ ఆద్మీ పార్టీ' రూపొందించిన పాటను భారత ఎన్నికల సంఘం నిషేధించింది. ఈ నిర్ణయాన్ని ఆప్ తప్పుపట్టింది. ఎన్నికల సంఘం ఆశ్రితపక్షపాతంతో వ్యవహరిస్తోందని ఆరోపించింది.
ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కేజ్రీవాల్ భార్య సునీతా కేజ్రీవాల్ లోక్సభ ఎన్నికల ప్రచార బరిలోకి దిగారు. పార్టీ ఈస్ట్ ఢిల్లీ అభ్యర్థి కుల్దీప్ కుమార్ తరఫున శనివారంనాడు ప్రచారం సాగించారు. ఇందులో భాగంగా రోడ్షో నిర్వహించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్యం కుంభకోణంలో ఈడీ అరెస్ట్ చేసింది. దీంతో ప్రస్తుతం ఆయన తీహార్ జైల్లో ఉన్నారు. మరోవైపు లోక్సభ ఎన్నికలకు వివిద దశల్లో పోలింగ్ జరుగుతుంది. అలాంటి వేళ.. దేశ రాజధాని ఢిల్లీలోని లోక్సభ స్థానాల్లో తమ సత్తా చాటాలని ఆప్ నిర్ణయించింది.
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ని(Arvind Kejriwal) తీహార్ జైల్లోనే(Tihar Jail) చంపేందుకు బీజేపీ(BJP) కుట్రపన్నుతోందని ఆయన సతీమణి ఆప్ నేత సునీతా కేజ్రీవాల్(Sunitha Kejriwal) సంచలన ఆరోపణలు చేశారు.
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ స్పీడ్కు బ్రేకులు వేసేందుకు ఇండియా కూటమి సర్వశక్తులు ఒడ్డుతోంది. కేంద్రంలో మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొడుతుందనే ప్రచారం జోరుగా సాగుతున్న నేపథ్యంలో ఎలాగైనా బీజేపీ అధికారంలోకి రాకూండా అడ్డుకట్టవేసేందుకు విపక్ష ఇండియా కూటమి అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తమ మేనిఫెస్టోను విడుదల చేయగా.. ఏడు అంశాలతో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.