Home » AAP
మద్యం కుంభకోణం కేసులో అరెస్టై కస్టడీలో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ చేసిన ఆరోపణలను ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ తోసిపుచ్చారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్పై కుట్ర జరుగుతోందని, జైలులో ఆయనకు ఏదైనా జరగవచ్చని ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. ఎల్జీ, ఈడీ, తీహార్ జైలు అధికారులపై కూడా ఆయన అరోపణలు గుప్పించారు.
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టైన జైలులో ఉన్న అరవింద్ కేజ్రీవాల్ పై ఈడీ విచిత్ర ఆరోపణలు చేసింది. కేజ్రీవాల్ తన షుగర్ లెవెల్స్ను నిరంతరం పరీక్షించేందుకు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతించాలని కోరుతూ దిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
లిక్కర్ స్కామ్లో అరెస్టై తీహర్ జైలులో ఉన్న ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై వరసగా విమర్శలు చేస్తున్నారు. జైలులో తనను ఎక్కువగా టార్గెట్ చేశారని, 24 గంటల పాటు నిఘా ఉంచారని, రోజువారి కార్యకలపాలు, సమావేశాలపై కూడా దృష్టిసారించారని మండిపడ్డారు.
పంజాబ్లో నలుగురు లోక్సభ అభ్యర్థులను ఆమ్ ఆద్మీ పార్టీ మంగళవారం ప్రకటించింది. ఫిరోజ్పూర్ నుంచి జగదీప్ సింగ్ కాక బ్రార్, గురుదాస్పూర్ నుంచి అమన్షేర్ సింగ్, జలంధర్ నుంచి పవన్ కుమార్ టిను, లూథియానా నుంచి అశోక్ పరాశర్ పప్పీలను ఎన్నికల బరిలో దింపుతున్నట్లు తెలిపింది.
పంజాబ్లోని ఫరీద్కోట్ లోక్సభ స్థానం నుంచి సరబ్జిత్ సింగ్ స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో దిగారు. అతడు మాజీ ప్రధాని ఇందిరాగాంధీని హత్య చేసిన బియాంత్ సింగ్ కుమారుడు.
లిక్కర్ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ కావడంతో రాజకీయ పరిణామాలు మారిపోతున్నాయి. ఢిల్లీలో తమ ప్రభుత్వాన్ని పడగొట్టాలని బీజేపీ చూస్తోందని మంత్రి ఆతిషి సంచలన ఆరోపణలు చేశారు. దీంతో బీజేపీ నేతలు, ఆప్ మంత్రులు మధ్య మాటల యుద్దం తీవ్రస్థాయికి చేరింది.
దిల్లీ మద్యం కేసులో ఈడీ విచారణలతో దేశ రాజధాని అట్టుడుకుతోంది. ఇప్పటికే దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ( Kejriwal ) ను అరెస్టు చేసిన ఈడీ మరికొందకు ఆప్ నేతలపై చర్యలు తీసుకునే పనిలో నిమగ్నమైంది.
ఆమ్ ఆద్మీ పార్టీ నేత, అరవింద్ కేజ్రీవాల్ మంత్రివర్గంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న రాజ్ కుమార్ ఆనంద్ తన మంత్రి పదవికి బుధవారంనాడు రాజీనామా చేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి సైతం ఆయన రాజీనామా సమర్పించారు. మార్చి 21వ తేదీన కేజ్రీవాల్ అరెస్టు తర్వాత మంత్రివర్గం నుంచి రాజీనామా చేసిన తొలి వ్యక్తి కూడా రాజ్కుమార్ ఆనంద్ కావడం విశేషం.
దేశ రాజధాని ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు అయిన తర్వాత ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించాలని కోరుతూ పదే పదే పిటిషన్లు దాఖలు అవుతుండటంపై ఢిల్లీ హైకోర్టు బుధవారం అసంతృప్తి వ్యక్తం చేసింది.