Home » AAP
బీహార్లో మరికొన్ని రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. ఇక్కడ అన్ని స్థానాలకు తాము ఒంటరిగా పోటీ చేస్తామని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) సంచలన ప్రకటన చేశారు.
అకాలీదళ్ సీనియర్ నేత బిక్రమ్ మజిథియాపై విజిలెన్స్ కేసు వ్యవహారంలో ఆప్ ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై విజయ్ ప్రతాప్ బహిరంగ విమర్శలు చేసిన క్రమంలో ఆయనపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. దాడుల సమయంలో మజిథియా భార్య విలిజెన్స్ టీమ్తో గొడవ పడుతున్న వీడియోను సోషల్ మీడియాలో విజయ్ ప్రతాప్ పోస్ట్ చేశారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా పరాజయం పాలైన ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. గుజరాత్, పంజాబ్లలో జరిగిన ఉప ఎన్నికల్లో రెండు చోట్ల విజయబావుటా ఎగురవేసింది.
ఆప్ నాయకత్వంలో ఎంసీడీ పనితీరుతో తాము అసంతృప్తిగా ఉన్నట్టు కౌన్సిలర్ హిమాని జైన్ తెలిపారు. ఆ కారణంతోనో తాను, మరికొందరు కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేసి 'ఇంద్రప్రస్థ వికాస్ పార్టీ' పేరుతో కొత్త పార్టీ ఏర్పాటుకు నిర్ణయించినట్టు చెప్పారు.
MLAs: రాజకీయాలంటే.. సంపాదనకే పరామావధి అన్నట్లుగా ప్రస్తుత పరిస్థితులు మారిపోయాయి. కానీ ఎమ్మెల్యేగా ఎన్నికైనా కేవలం రూ . లక్ష సంపద కూడా లేని వారు దేశంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారి జాబితాను ఏడీఆర్ విడుదల చేసింది.
ఢిల్లీ ఆప్ అధ్యక్షుడిగా నియమితులైన సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, తమకు ఓటు వేసిన ప్రజల తరఫున, నెలకు రూ.2,500 ఆర్థిక సాయం, గ్యాస్ సిలిండర్ హామీలతో బీజేపీకి ఓటు వేసిన ప్రజల తరఫున వారి హక్కులు కాపాండేందుకు తమ గళం వినిపిస్తామని చెప్పారు.
కేజ్రీవాల్, ఆప్ మాజీ ఎమ్మెల్యే గులాబ్ సింగ్, మాజీ ద్వారక కౌన్సిలర్ నితిక శర్మ ఉద్దేశపూర్వకంగానే ప్రజా నిధులను దుర్వినియోగం చేస్తూ ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో భారీ హోర్డింగ్లు పెట్టారని పిటిషనర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
గోవా, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసేందుకు తమ పార్టీ సిద్ధంగా ఉందని, ఇప్పటి వరకూ పొత్తులపై ఎలాంటి చర్చలు జరగలేదని ఆప్ సీనియర్ నేత అతిషి చెప్పారు.
కేజ్రీవాల్ రాజకీయ ప్రయోజనాల కోసం సొంత తల్లిదండ్రులను కూడా వాడుకున్నారని పర్వేష్ వర్మ ఆరోపించారు. తన తండ్రి నడవగలిగినప్పటికీ కేవలం ఓట్ల కోసం ఆయనను వీల్చైర్లో తీసుకువచ్చారని చెప్పారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవి చూసిన ఆప్ అధినేత కేజ్రీవాల్ ఎంపీగా పార్లమెంటులో కాలుపెడతారంటూ వస్తున్న వార్తలపై ఆప్ క్లారిటీ ఇచ్చింది. అవన్నీ ప్రతిపక్షాలు వ్యాపిస్తున్న రూమర్లంటూ కొట్టి పారేసింది.