Home » AAP
ఢిల్లీ మద్యం విధానంలో మనీ ల్యాండరింగ్ వ్యవహారంలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్తోపాటు తన అరెస్ట్ను సవాల్ చేస్తూ.. దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు గురువారం విచారణ జరిపింది. అందుకు సంబంధించిన తీర్పును సుప్రీంకోర్టు రిజర్వ్ చేసింది.
వచ్చే నెలలో హరియాణా అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ.. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం రాజకీయ పార్టీలు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నాయి. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కలిసి ఈ ఎన్నికల్లో వెళ్లేందుకు సమాయత్తమయ్యాయి.
ఢిల్లీ వక్స్ బోర్డ్లో ఆర్థిక అవకతవకలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సోమవారంనాడు అరెస్టు చేసింది.
ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన ఈడీ కేసులో 'ఆమ్ ఆద్మీ పార్టీ' మాజీ ఆఫీస్ బేరర్ విజయ్ నాయర్ కు సుప్రీంకోర్టు నుంచి ఉపశమనం లభించింది. ఈ కేసులో 23 నెలలుగా తీహార్ జైలులో ఉన్న నాయర్కు అత్యున్నత న్యాయస్థానం సోమవారంనాడు బెయిల్ మంజూరు చేసింది.
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. ఆ రాష్ట్ర మాజీ ఎమ్మెల్యే ఒకరికి కలలోకి వచ్చారట! ఆప్ను వీడి బీజేపీలో చేరిన తనకు హితబోధ చేశారట! దీంతో తిరిగి సొంతగూటికి చేరుకోవాలని ఆయన నిర్ణయించుకున్నారట!
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన కలలో కనిపించి.. రామ్ చందర్ వెళ్లి పార్టీ నేతలు మనీశ్ సిసోడియా, గోపాల్ రాయ్, సందీప్ పాఠక్లతోపాటు ఇతర నేతలను కలువు. అలాగే మీ ప్రాంతంలోని పార్టీ కార్యకర్తలను కలువు. వారితో కలిసి పని చేయాలని తనను మందలించారన్నారు.
సామాన్య ప్రజల సమస్యలను తెలుసుకోవడం కోసం ముఖ్యమంత్రి ఈ విధంగా ఎద్దుల బండిపై ప్రయాణించారని బీజేపీ వెల్లడించింది. అలాగే ఎన్నికల నేపథ్యంలో సీఎం సైనీ సుడిగాలి ప్రచారం నిర్వహిస్తున్నారన్నారు. ఆ క్రమంలో రైతులు, దళితులు, పేదల కోసం తమ ప్రభుత్వం చేపట్టిన చర్యలను వివరిస్తున్నారని ఆ పార్టీ ప్రకటించింది.
హరియాణా అసెంబ్లీకి ఆక్టోబర్ 1వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. అలాంటి వేళ కంగనా రనౌత్ చేసిన ఈ వ్యాఖ్యలు.. బీజేపీయేతర పక్షాలకు ఆయుధంగా మలచుకున్నాయి. అందులోభాగంగా రైతుల పట్ల బీజేపీ మైండ్ సెట్ ఎలా ఉందనేందుకు కంగనా రనౌత్ వ్యాఖ్యలే నిదర్శనమని ఆమ్ ఆద్మీ పార్టీ ఇప్పటికే స్పష్టం చేసింది.
ఢిల్లీ లిక్కర్ పాలసీకి సిబీఐ నమోదు చేసిన కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఎలాంటి ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ జ్యుడిషియల్ కస్టడీని సెప్టెంబర్ 3న తేదీ వరకూ రౌస్ ఎవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి కావేరి బవేజా మంగళవారంనాడు పొడిగించారు.
జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే ఏడుగురు అభ్యర్థుల తొలి జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ అదివారంనాడు ప్రకటించింది. వీటిలో పుల్వామా, రాజ్పోరా, దేవ్సర్, దూరు, దోడా, దోడా వెస్ట్, బనిహాల్ అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.