Home » AAP
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు గెహ్లాట్ రాజీనామా లేఖ రాశారు. అమలుకు నోచుకోలేని వాగ్దానాలు, ఇటీవల తలెత్తిన వివాదాలు వంటివి తన రాజీనామాకు కారణాలుగా అందులో ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను పార్టీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
కిరారీ అసెంబ్లీ నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్తల్లోనూ గట్టిపట్టు ఉన్న అనిల్ ఝా కొద్దికాలంలో పార్టీ నాయకత్వం, విధానాలపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ మారడం ద్వారా బీజేపీకి సంప్రదాయబద్ధంగా గట్టి పట్టున్న కిరారీలో ఆప్కు లబ్ధి చూకూరే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఢిల్లీ మేయర్ పీఠానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మహేశ్ కించి విజయం సాధించారు.
అహ్మద్ భార్య, కుమారుడు కూడా ఇటీవల ఆప్లో చేరారు. అక్టోబర్ 29న అహ్మద్ కుమారుడు చౌదరి జుబీర్ అహ్మద్, ఆయన కౌన్సిలర్ భార్య షాగుఫ్తా చౌదరి ఆప్లో చేరారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అహ్మద్ కుటుంబం పార్టీ మారడం కాంగ్రెస్కు మింగుడపడటం లేదని తెలుస్తోంది.
ఈ ఏడాది అంటే 2024, ఫిబ్రవరి 3వ తేదీన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (CAPFIMS) రహదారిని ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనా సందర్శించారు. రైట్ ఆప్ వేలో చెట్లను తొలగించాలని ఎల్జీ ఆదేశించారు. అందుకు సంబంధించిన అంశాలు చెట్లు నరికిన సంస్థలు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేశాయి.
ప్రధాని మోదీ విద్యార్హతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనకు జారీ అయిన సమన్లను కొట్టేయాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది
నగదు అక్రమ చలామణి కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్కు శుక్రవారం రౌజ్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మనీ లాండరింగ్ కేసులో బెయిలు మంజూరు కావడంతో ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ముఖ్యమంత్రి అతిషి, ఆప్ కీలక నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా తదితరులు జైలు బయట సత్యేంద్ర జైన్కు సాదర స్వాగతం పలికారు.
విచారణలో జాప్యం, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచిన కారణంగా సత్యేంద్ర జైన్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. విచారణకు తెరపడేటట్టు కనిపించడం లేదని కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు, పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.