Home » AAP
ఈ ఏడాది అంటే 2024, ఫిబ్రవరి 3వ తేదీన సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్సెస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (CAPFIMS) రహదారిని ఢిల్లీ ఎల్జీ వీకే సక్సెనా సందర్శించారు. రైట్ ఆప్ వేలో చెట్లను తొలగించాలని ఎల్జీ ఆదేశించారు. అందుకు సంబంధించిన అంశాలు చెట్లు నరికిన సంస్థలు.. సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో స్పష్టం చేశాయి.
ప్రధాని మోదీ విద్యార్హతలపై చేసిన వ్యాఖ్యలకు సంబంధించి తనకు జారీ అయిన సమన్లను కొట్టేయాలని ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్టేసింది
నగదు అక్రమ చలామణి కేసులో ఢిల్లీ మాజీ మంత్రి, ఆప్ నాయకుడు సత్యేందర్ జైన్కు శుక్రవారం రౌజ్ అవెన్యూలోని ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
మనీ లాండరింగ్ కేసులో బెయిలు మంజూరు కావడంతో ఆప్ నేత, ఢిల్లీ మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ శుక్రవారం సాయంత్రం తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ముఖ్యమంత్రి అతిషి, ఆప్ కీలక నేతలు సంజయ్ సింగ్, మనీష్ సిసోడియా తదితరులు జైలు బయట సత్యేంద్ర జైన్కు సాదర స్వాగతం పలికారు.
విచారణలో జాప్యం, ఎక్కువ కాలం నిర్బంధంలో ఉంచిన కారణంగా సత్యేంద్ర జైన్కు బెయిల్ మంజూరు చేస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. విచారణకు తెరపడేటట్టు కనిపించడం లేదని కూడా కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు, పంజాబ్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ విస్తరణ ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ట్రాల్లో బరిలో నిలిచి అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.
దేశ రాజధానిలో విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వం పునరుద్ధాటించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ నిధులతో నడిచే డీయూ కాలేజీలకు రూ.100 కోట్ల నిధులను ఆదివారంనాడు విడుదల చేసింది.
నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ ఇప్పటికే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన బలాన్ని సమకూర్చుతుంది. సొంతంగా 42 సీట్లలో ఎన్సీ గెలుపొందగా, భాగస్వామ్య పార్టీగా ఉన్న కాంగ్రెస్ 6, సీపీఎం ఒక సీటు గెలుచుకున్నాయి.
అరవింద్ కేజ్రీవాల్ ముఖ్యమంత్రి పదవికి ఇటీవల రాజీనామా చేయడంతో అతిషి సీఎం పగ్గాలు చేపట్టారు. కేజ్రీవాల్ తన నివాసాన్ని ఖాళీ చేయడంతో అందులోకి అతిషి ఇటీవల వచ్చి చేశారు. ఇక్కడే వివాదం మొదలైంది.
జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై ఆప్ అధికార ప్రతినిధి ప్రియాంక కక్కర్ స్పందించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల వేళ.. ఇండియా కూటమిలోని భాగస్వామ్య పక్షాలను కాంగ్రెస్ పార్టీ అంతగా పట్టించుకోలేదని విమర్శించారు. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ ఓటమికి అతి విశ్వాసమే కారణమన్నారు.