Home » AAP
గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్తో ఆప్ పొత్తుపెట్టుకున్నప్పటికీ ఆ తర్వాత జరిగిన హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఒంటరిగా పోటీ చేసింది. తాజాగా ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఒంటరిగానే పోటీ చేస్తున్నట్టు ఆప్ మొదట్లోనే ప్రకటించింది.
ఢిల్లీలో 'ఆప్' తమకు విపక్షమని రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి బుధవారంనాడు జరిగిన ఒక కార్యకర్మంలో రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ వ్యాఖ్యానించడంపై ఆప్ కన్వీనర్, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చురకలు వేశారు.
మూడు నెలల క్రితం కూడా ఇలాగే చేశారని, తన వస్తువులన్నింటినీ రోడ్డుపైకి విసిరేశారని అతిషి ఆక్షేపణ తెలిపారు. బీజేపీ ఒకటి గుర్తుంచుకోవాలని, ఇవాళ మరోసారి సీఎం నివాసం నుంచి గెంటేసినా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నిలుపుకొంటామని చెప్పారు.
కేజ్రీవాల్ను మరోసారి అదికారంలోకి తీసుకురావాలంటూ ఎన్నికల ప్రచార గీతాన్ని తాజాగా ఆ పార్టీ విడుదల చేసింది. ''ఫిర్ లాయేంగే కేజ్రీవాల్" అనే టైటిల్, 3.38 నిమిషాల నిడివితో ఈ సాంగ్ ఉంది.
కాంగ్రెస్ పార్టీపై కేజ్రీవాల్ విమర్శలు గుప్పిస్తూ, ఆ పార్టీ ప్రజలకు దూరమైందని, ప్రజాసమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి కొరవడిందని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ రెండు ప్రజావిశ్వాసం కోల్పోయినందున వారు కూటమిగా ఏర్పడాలని సూచించారు.
'ఆమ్ ఆద్మీ పార్టీ' మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాను ఇప్పటికే విడుదల చేయగా, బీజేపీ ఇంతవరకూ అభ్యర్థుల జాబితాను ప్రకటించ లేదు. 2015 నుంచి ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది.
2016లో 8 ఆలయాలను కూల్చేందుకు అప్పటి హోం మంత్రి సత్యేంద్రజైన్ సంతకంతో ఆదేశాలు ఇచ్చారని, కానీ ఎలాంటి చారిత్రక ప్రాధాన్యత లేని రెండు మసీదులను పరిరక్షించేందుకు ఆయన జోక్యం చేసుకున్నారని షెహజాద్ పూనావాలా అన్నారు.
'మహిళా సమ్మాన్ యోజన' పేరుతో రిజిస్ట్రేషన్లు చేస్తున్న వ్యక్తులపై లీగల్ చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా శనివారంనాడు ఆదేశించారు.
న్యూఢిల్లీ విధాన్ సభ నియోజకవర్గంలో ఇప్పుడే పర్యటించి తాను వచ్చానని, బీజేపీ నేతలు బహిరంగంగానే ఓట్లు కొంటున్నారని కేజ్రీవాల్ తెలిపారు.
మహిళా సమ్మాన్ యోజన పథకం కింద మహిళా లబ్ధిదారులకు ప్రతినెలా రూ.2,100 ఆర్థిక సాయం అందిస్తారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆప్ పథకాలు కీలకంగా ఉన్నాయి.