Home » AAP
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముంచుకొస్తున్న తరుణంలో ఆధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష బీజేపీ మధ్య ఈ ఆసక్తికర పోస్టర్ వార్ చోటుచేసుకుంది. 'పుష్ప 2' చిత్రంలోని పాపులర్ డైలాగ్ 'తగ్గేదేలే' అంటూ కేజ్రీవాల్ పార్టీ గుర్తు 'చీపురు' చేత పట్టుకున్న పోస్టర్ను ఆప్ విడుదల చేసింది.
ప్రతాప్గంజ్ ఎమ్మెల్యేగా ఉన్న సోసిడియా ఈసారి జంగ్పుర నియోజకవర్గం నుంచి పోటీ చేయనున్నారు. ప్రతాప్గంజ్ నియోజకవర్గాన్ని ఇటీవలే పార్టీలో చేరిన విద్యావేత్త, పాపులర్ యూట్యూబర్ అవథ్ ఓఝాకు కేటాయించారు.
దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది.
ఢిల్లీ ఆరవ లెజిస్లేటివ్ అసెంబ్లీ సభ్యుడైన షోకోన్ ప్రస్తుతం నాంగ్లోయి జాట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 1983-88 మధ్య ఆయన కురుక్షేత్ర ఎన్ఐటీలో ఇంజనీరింగ్ గ్యాడ్యుయేట్ చేశారు.
ఆమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రవాణా శాఖ మంత్రి కైలాష్ గెహ్లోత్ తన మంత్రి పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.
లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ జైలులో ఉండటంతో 'ఇండిపెండెన్స్ డే' సందర్భంగా త్రివర్ణ పతాకం ఎవరు ఎగుర వేయాలనే దానిపై పరిశీలన జరిగింది. అప్పటి ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న అతిషిని త్రివర్ణ పతాకం ఎగురవేయాలని కేజ్రీవాల్ ఆదేశించారు.
ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్కు గెహ్లాట్ రాజీనామా లేఖ రాశారు. అమలుకు నోచుకోలేని వాగ్దానాలు, ఇటీవల తలెత్తిన వివాదాలు వంటివి తన రాజీనామాకు కారణాలుగా అందులో ఆయన పేర్కొన్నారు. ఢిల్లీ ప్రజలకు ఇచ్చిన కీలక హామీలను పార్టీ నిలబెట్టుకోలేదని ఆయన విమర్శించారు.
కిరారీ అసెంబ్లీ నియోజకవర్గంలో కింద స్థాయి కార్యకర్తల్లోనూ గట్టిపట్టు ఉన్న అనిల్ ఝా కొద్దికాలంలో పార్టీ నాయకత్వం, విధానాలపై అసంతృప్తితో ఉన్నారు. తాజాగా ఆయన పార్టీ మారడం ద్వారా బీజేపీకి సంప్రదాయబద్ధంగా గట్టి పట్టున్న కిరారీలో ఆప్కు లబ్ధి చూకూరే అవకాశాలున్నాయని అంటున్నారు.
ఢిల్లీ మేయర్ పీఠానికి జరిగిన ఎన్నికల్లో బీజేపీకి ఆమ్ ఆద్మీ పార్టీ బిగ్ షాక్ ఇచ్చింది. ఈ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థి మహేశ్ కించి విజయం సాధించారు.
అహ్మద్ భార్య, కుమారుడు కూడా ఇటీవల ఆప్లో చేరారు. అక్టోబర్ 29న అహ్మద్ కుమారుడు చౌదరి జుబీర్ అహ్మద్, ఆయన కౌన్సిలర్ భార్య షాగుఫ్తా చౌదరి ఆప్లో చేరారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో అహ్మద్ కుటుంబం పార్టీ మారడం కాంగ్రెస్కు మింగుడపడటం లేదని తెలుస్తోంది.