Home » AAP
2013లో ఆప్కు కాంగ్రెస్ మద్దతు ఇవ్వడం, 2024లో జతకట్టడం వల్ల కాంగ్రెస్కు నష్టం జరిగిందని అజయ్ మాకెన్ చెప్పారు. ఢిల్లీ ప్రజలు సమస్యలు ఎదుర్కోవడం వల్ల బీజేపీకి లబ్ధి చేకూరుతుందనేది తన నిశ్చితాభిప్రాయమని అన్నారు.
న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకర్గంలో శనివారంనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, గతంలో తాము ఇచ్చిన మూడు హామీలను నెరవేర్చలేకపోయినట్టు కేజ్రీవాల్ చెప్పారు.
బీజేపీ 'గూండాలే' ఈ దాడికి పాల్పడినట్టు ఆప్ ఒక ట్వీట్లో ఆరోపించింది. ఇందుకు సంబంధించిన వీడియోను పోస్ట్ చేసింది. అయితే ఆ ఆరోపణలను బీజేపీ తిప్పికొట్టింది.
ఎన్నికల నిబంధన ప్రకారం పార్టీలు ఇలాంటి (డాక్యుమెంటరీ ప్రదర్శన) ఈవెంట్లు నిర్వహించాలనుకుంటే జిల్లా ఎన్నికల అధికారి (డీఈఓ) కార్యాలయంలోని సింగిల్ విండో సిస్టం ద్వారా అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని, సందర్భాన్ని బట్టి పోలీసులు అనుమతి ఇవ్వడం కానీ నిరాకరించడం కానీ జరుగుతుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
తమ పార్టీ అధికారంలోకి వస్తే స్కూళ్లు, కాలేజీలకు వెళ్లేందుకు బస్సు ఛార్జీలు సైతం లేకుండా అవస్థలు పడుతున్న విద్యార్థులకు బాసటగా నిలుస్తామని మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.
అతిషిపై బిధూడి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది మొదటిసారి కాదు. అతిషి ఇంటిపేరు మార్చుకున్నారంటూ జనవరి 6న రోహిణిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన వ్యాఖ్యానించడం వివాదాస్పదమైంది.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అభ్యర్థిగా కల్కాజీ నియోజకవర్గం నుంచి అతిషి పోటీలో ఉన్నారు. ఎన్నికల ప్రచారానికి రూ.40 లక్షలు అవుతుందని అతిషి అంచనా వేశారు.
మద్యం విధానంపై కాగ్ నివేదికను అసెంబ్లీకి సమర్పించేలా ప్రత్యేక సమావేశానికి ఆదేశించాలంటూ బీజేపీకి చెందిన ఏడుగురు ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై కోర్టు విచారణ జరిపింది.
కేజ్రీవాల్ మాయలో ఢిల్లీ ప్రజలు చిక్కుకోవద్దని బిధూరి సూచించారు. ఢిల్లీ ప్రజల కోసం అంకితమైన బీజేపీకి మెజారిటీ ఇవ్వాలని కోరారు. బీజేపీ అంటే తనకు ఎంత అంకితభావం ఉందో ప్రజల పట్ల కూడా అంతే అంకితభావం ఉందని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల ఓటర్ల జాబితాలో కొత్తగా భారీ సంఖ్యలో ఓటర్లు నమోదు కావడంపై కేజ్రీవాల్ మరోసారి ఆందోళన వ్యక్తం చేశారు. గత డిసెంబర్ 15, జనవరి 8వ తేదీ మధ్య 15 రోజుల కాలంలో 13,000 కొత్త ఓటర్లు వచ్చి చేశారని చెప్పారు.