Home » Aadhaar Card
అక్రమ వలసలను అరికట్టడంలో భాగంగానే ఇక నుంచి ఆధార్ కార్డుల జారీ విషయంలో కఠినంగా వ్యవహరించాలని తమ ప్రభుత్వం నిర్ణయించినట్టు అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు.
ఆధార్ కార్డు తీసుకుని 10 సంవత్సరాలు దాటిన వారు తమ వివరాలను అప్డేట్(Aadhaar Update) చేసుకోవాలనే సంగతి తెలిసిందే.
మీ పిల్లల ఆధార్ వివరాలను ఇంకా అప్డేట్ చేయలేదా. అయితే గుడ్ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు మీరు ఆ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవచ్చు. ఆ గడువును ఇటివల కేంద్ర పొడిగించింది. ఈ నేపథ్యంలో పిల్లల ఆధార్ వివరాలను ఎలా అప్డేట్ చేయాలనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రెవెన్యూ చట్టంలో మొదటిసారిగా ‘భూధార్ కార్డు’ రాబోతుంది. వ్యక్తులకు ఆధార్ కార్డు మాదిరిగా.. రికార్డులో నమోదు చేసిన భూమికి ప్రత్యేక గుర్తింపు సంఖ్యతో భూధార్ కార్డు జారీ చేయనున్నారు.
మీ భవిష్యత్తుకు ఆధార్ కార్డే కీలకమంటూ దేశ ప్రజలకు కేంద్రం గతంలోనే స్పష్టం చేసింది. దీంతో అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పండు ముసలి వరకు అంతా ఆధార్ కార్డు తీసుకున్నారు. తీసుకొంటున్నారు.
ఆధార్ ఆన్లైన్ నెట్వర్క్లో లోపాలతో.. గురువారం రాష్ట్రవ్యాప్తంగా భూముల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. రాష్ట్రంలో భూములు/స్థిరాస్తులు, డాక్యుమెంట్ల రిజిస్ట్రేషన్కు ఆధార్ బయోమెట్రిక్ తప్పనిసరి.
ఉచిత ఇసుక విధానాన్ని ఎంత పకడ్బందీగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినా, అందులో చిల్లులను కొందరు సరఫరాదారులు వెతికి పట్టుకొని సొమ్ము చేసుకొనేందుకు అప్పుడే వ్యూహరచన మొదలుపెట్టారు.
మీరు పాన్, ఆధార్లను(PAN, Aadhaar) ఇంకా లింక్ చేయలేదా. అయితే ఇప్పుడే చేసేయండి. ఇప్పటికే చివరి తేదీ పూర్తింది. కానీ ఇప్పటికైనా జరిమానాతో చెల్లించండి. లేదంటే మరింత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది.
ఆధార్, రేషన్ కార్డుల అనుసంధానానికి గడువు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. ఈ నెల 30వరకు ఉన్న గడువును సెప్టెంబరు 30 వరకు పొడిగిస్తూ ఆహార, పౌరసరఫరాల విభాగం నోటిఫికేషన్ జారీ చేసింది.
నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్లోకి అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించిన ముగ్గురు అరెస్టు అయ్యారు. పోలీసుల కథనం ప్రకారం.. ఢీవీ ప్రాజెక్ట్స్ అనే సంస్థ పార్లమెంట్ భవన సముదాయంలోని ఎంపీల లాంజ్ నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. ఈ సంస్థ తరఫున కార్మికులుగా వచ్చిన ఖాసిమ్, మోనిస్, సోయబ్ నకిలీ ఆధార్ కార్డులతో పార్లమెంట్ భవనంలోకి ప్రవేశించేందుకు యత్నించి ఫ్లాప్ గేట్ వద్ద జరిగిన తనిఖీల్లో పట్టుబడ్డారు.