Home » 2024
మండలంలోని మా మిళ్ళపల్లిలో భరతరెడ్డి అనే రైతుకు చెందిన శ్రీగంధం చెట్లు సో మవారం అగ్నికి ఽఆహుతయ్యాయి. గ్రామానికి చెందిన భరతరెడ్డి ఐదెకరాల్లో శ్రీగంధం చెట్లు సాగుచేస్తున్నాడు. ఆ తోటలో మంట లు వ్యాపిస్తున్నాయని స్థానిక రైతులు అతడికి సమాచారం అందించారు.
నగర శివార్లలోని శిల్పారామంలో సాంస్కృతి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సంక్రాం తి పండుగను పురస్కరించుకుని శిల్పారామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నారు. ఏఓ క్రిష్ణప్రసాద్ సంబరాలను ప్రారంభించారు.
నియోజకవర్గ కేంద్రమైన శింగనమల ఆర్టీసీ బస్టాండ్ అవరణంలోకి గత 15 ఏళ్లగా బస్సులు వచ్చి న దాఖలాలు లేవు. ప్రయాణికు లు బస్సు ఎక్కాలంటే పక్క ఉన్న రోడ్డు కు వెళ్లాల్సిందే. దీంతో బస్టాండ్ శిథిలావస్థకు చేరుతోంది. ఈ సమ యంలో ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ చొరవవతో పది రోజుల నుంచి బస్సులను ఆర్టీసీ బస్టాండ్ తీసుకెళ్తున్నారు. ప్రయాణికులు బస్టాండ్ అవ రణంలో బస్సు ఎక్కుతున్నారు.
కోరిన కోర్కెలు తీర్చే భక్తుల ఇల వేల్పుగా విరాజిల్లు తున్న గుంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వా మికి ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రఽధాన ఆర్చకులు రామాచార్యులు వేకువ జామున స్వామివారికి వివిధ అభి షేకాలు చేసి, ప్రత్యేక ఆలంకరణ చేశారు.
జిల్లా స్థాయి కబడ్డీ పోటీల విజేతలుగా ఆర్డీటీ, డీఎస్ఏ జట్లు నిలిచాయి. వివేకానంద జయంతి సందర్భంగా ఆదివారం స్థానిక అశోక్నగర్ డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో వివేకానంద స్పోర్ట్స్ సొసైటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు నిర్వహించారు.
అవే సంస్థ ద్వారా నిజాయితీపరులైన ఉద్యోగులకు అవార్డులు ప్రధానం చేయనున్నట్లు అవే సంస్థ వ్యవస్థాపకులు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వైకుంఠం ప్రభాకర్ చౌదరి పేర్కొన్నారు. ఈ మేరకు ఆదివారం అనంతపురంలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడా రు.
నగర శివారు ప్రాంతంలో రైల్వే గేటు వద్ద నుంచి జాతీయ రహదారి వరకు రోడ్డు అధ్వానంగా మారిం ది. దారంతా గుంతల మయంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రసన్నాయపల్లి రైల్వే స్టేషన సమీపంలో నాయక్నగర్ రైల్వే గేటు వద్ద నుంచి 44వ జాతీయ రహదారి వరకు దాదాపు 3 కి.మీ రోడ్డు గుంతల మయంగా ఉంది.
రాజకీయాలకు అతీ తంగా సీఎం సహాయనిధి ద్వారా పేద వర్గాలను ఆదుకుంటున్న ప్రభు త్వం తమదని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. అనంతపురంలోని ఆమె క్యాంప్ కార్యాలయంలో శనివారం రాప్తాడు నియోజకవర్గంలోని నలుగురికి సీఎం సహాయ నిధి ద్వారా రూ.9.70 లక్షల చెక్కులను ఎమ్మె ల్యే అందజేశారు.
అనంతపురం డిపోకు కొత్తగా వచ్చిన రెండు సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ జోనల్ చైర్మన పూల నాగరాజు ప్రారంభించారు. రెండు నూతన బస్సుల్లో ఒకదానిని అనంతపురం - నెల్లూరు, మరో బస్సును అనంతపురం - ఒంగోలు రూట్లకు కేటాయించారు. అనంతపురం డిపో ఆవరణలో శనివారం జోనల్ చైర్మన పూల నాగరాజు రిబ్బన కట్చేసి, పచ్చజెండా ఊపి ప్రారంభించారు.
మండలంలోని చిన్నంపల్లిలో వెలసిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం స్వా మి కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. గ్రా మస్థుల ఆధ్వర్యంలో శ్రీదేవి, భూదేవి, వెంకటేశ్వరస్వామి ఉత్సవమూర్తులను అలంకరించి, కల్యాణోత్సవం నిర్వహించారు. మధ్యా హ్నం అన్నదానం చేశారు.