పెరిగిన ఎండ తీవ్రత
ABN , Publish Date - Mar 13 , 2026 | 05:12 AM
ఉత్తరాది నుంచి పొడిగాలులు వీయడంతో రాష్ట్రం లో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది.
విశాఖపట్నం, మార్చి 12: ఉత్తరాది నుంచి పొడిగాలులు వీయడంతో రాష్ట్రం లో ఎండ తీవ్రత ఒక్కసారిగా పెరిగింది. గురువారం కర్నూలులో అత్యధికంగా 39.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. మరికొన్నిచోట్ల 37, 38 డిగ్రీలు నమోదయ్యాయి. రానున్న రెండు రోజుల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు, నాలుగు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది.