ఎస్టీపీపీలో కొత్త యూనిట్కు మోక్షమెప్పుడో...?
ABN , Publish Date - Jan 10 , 2026 | 11:44 PM
జిల్లాలోని జైపూర్ మండలం పెగడపల్లి వద్ద ఉన్న సింగరేణి థర్మ ల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో మరో యూనిట్ ప్రా రంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ 2016 జనవరి మాసంలో విధ్యుత్ ఉత్పతి వైపు దృష్టి సారించింది.
-ప్రస్తుతం 1200 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి
-మరో 800 మెగావాట్ల యూనిట్కు సింగరేణి సన్నాహాలు
-రూ.6,700 కోట్లతో బీహెచ్ఈఎల్తో సంస్థ ఒప్పందం
-గరిష్టంగా నాలుగేళ్లలో పనులు పూర్తి
-రెండేళ్ల క్రితమే పూర్తయిన అగ్రిమెంట్
-ప్లాంటు విస్తరణతో కొత్త ఉద్యోగాలకు అవకాశం
మంచిర్యాల, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని జైపూర్ మండలం పెగడపల్లి వద్ద ఉన్న సింగరేణి థర్మ ల్ పవర్ ప్లాంట్ (ఎస్టీపీపీ)లో మరో యూనిట్ ప్రా రంభానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 137 ఏళ్ల చరిత్ర కలిగిన సింగరేణి సంస్థ 2016 జనవరి మాసంలో విధ్యుత్ ఉత్పతి వైపు దృష్టి సారించింది. ఇం దులో భా గంగా సొంత అవసరాలతో పాటు వ్యాపార దృష్టితో మొదట 600 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించ డం లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ అనతికాలంలో నే మరో 600 యూనిట్లను విస్తరించి మొత్తం 1200 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధిస్తోంది. రాష్ట్రంలో నిరంతర వి ద్యుత్ సరఫరాలో ఎస్టీపీపీ ప్రధాన పాత్రను పోషి స్తోంది. తాను ఉత్పత్తి చేస్తున్న విద్యుత్ నుంచి సంస్థ 150 మెగావాట్లు మాత్రమే వినియోగించుకుం టుం డగా, మిగితా 1050 మెగావాట్ల విద్యుత్ను జెన్కో ద్వా రా రాష్ట్ర ప్రభుత్వానికి విక్రయిస్తోంది.
అందుబాటులో వనరులు...
విద్యుత్ ఉత్పత్తిని సాధించడం కోసం ప్రధానంగా అ వసరమైన బొగ్గు, నీరు అందుబాటులో ఉండటంతో ప్లాంట్ను ఏర్పాటు చేయగా, సుమారుగా రెండు వేల ఎకరాల భూములను సంస్థ రైతుల నుంచి సేకరించింది. 2015 సంత్సరాంతంలో విద్యుత్ ఉత్పత్తిని సాధించాలనే లక్ష్యంతో 2011సంవత్సరంలో కాంట్రాక్టు అవార్డు చేయడంతో పాటు 2012 సంవత్సరంలో అభివృద్ధి పను లను సంస్థ ప్రారంభించింది. రూ.7573 కోట్ల అంచనా వ్యయంతో (రెండు యూనిట్లు) 1200 మెగావాట్ల విద్యు త్ ప్లాంట్ పనులు పూర్తి చేయగా మరో రూ.6,700 కోట్ల అంచనా వ్యయంతో మూడో యూనిట్ 800 మెగావాట్ల సూపర్ క్రిటికల్ ప్లాంట్ ర్పాటు చేసే లక్ష్యంతో త్వరలో పనులు ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది.
గోదావరి నీరు తరలింపు....
మొట్ట మొదటిసారిగా విద్యుత్ ప్లాంట్ నిర్మాణం చేపట్టిన పెగడపల్లి సింగరేణి పవర్ ప్రాజెక్టుకు అవసరమైన 3 టీఎంసీల నీటిని గోదావరి, ప్రాణహిత నదుల నుంచి తరలిస్తూ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. గోదావరి నది నుంచిషెట్పల్లి, గంగిపల్లి, ఎల్కంటి, పెగడపల్లి శివారుల మీదుగా ప్లాంట్ ఆవరణలో నిర్మించిన రిజర్వాయర్ వరకు పైప్లైన్ ఏర్పాటు చేసి నీటిని తరలిస్తున్నారు. మిగితా 2 టీఎంసీల నీటిని కోటపల్లి మండలం దేవులవాడ శివారు ప్రాణహిత నది నుంచితరలించడం కోసం ఏర్పాట్లు చేశారు. అలాగే విద్యుత్ ఉత్పత్తికి అవసరమై బొగ్గును శ్రీరాంపూర్ ఓపెన్కాస్టు నుంచి తరలించేందుకు సంస్థ ప్రత్యేక రైలుమార్గాన్ని కూడా ఏర్పాటు చేసింది.
ఇప్పటికే పూర్తయిన టెండర్ ప్రక్రియ...
ఎస్టీపీపీలో మూడో యూనిట్ ఏర్పాటు చేసేందుకు త్వరలో పనులు ప్రారంభించనున్నారు. ఇప్పటికే 1200 మెగావాట్ల ఉత్పత్తిజరుగుతుండగా, వందశాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ (పీఏఎల్ఎఫ్) సాధిస్తూ దేశవ్యాప్త రికార్డు లు సృష్టిస్తోంది. ఐదేళ్లలో ఏకంగా 60వేల మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేసి రాష్ట్ర గ్రిడ్కు సరఫ రా చేసింది. త్వరలో మూడో యూనిట్ పనులు ప్రారం భించేందుకు చర్యలు చేపడుతుండగా, ఈ మేరకు సిం గరేణి హైద్రాబాద్లోని బీహెచ్ఈఎల్ సంస్థతో ఇటీవల ఒప్పందం పూర్తి చేసుకుంది. 2024 ఫిబ్రవరిలోనే ఈ కాంట్రాక్ట్ను బీహెచ్ఈఎల్ దక్కించుకోగా, అగ్రిమెంట్ పూర్తయిన నాటి నుంచి నాలుగేళ్లలో ప్రాజెక్టు పూర్తి చే యాల్సి ఉంది. అయితే కాంట్రాక్టింగ్ పూర్తయి ఇప్పటికే రెండేళ్లు గడుస్తుండగా, మరో రెండేళ్ల కాలంలో పనులు పూర్తవుతాయా అన్న సందేహాలు నెలకొన్నాయి.
కొత్త ఉద్యోగాలకు అవకాశం....
ఎస్టీపీపీలో కొత్త యూనిట్ను విస్తరిస్తే, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కూడా దక్కనున్నాయి. ఇప్పటికే సంస్థలో సుమారు రెండు వేల వరకు శాశ్వత, తాత్కాలిక ఉద్యోగులు పని చేస్తుండగా, మూడో యూని ట్ అవసరమైన మరో 1200 వరకు కొత్త ఉద్యోగాలు కల్పించనున్నారు. దీంతో ఉద్యోగావకాశాలు మెరుగు ప డగా, నూతనంగా ఉత్పత్తయ్యే విద్యుత్ను కూడా రాష్ట్ర అవసరాలకు విక్రయించనుంది.
త్వరలో శంకుస్థాపన...?
ఎస్టీపీపీలో ఏర్పాటు చేయదలిచిన మూడో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి పనులకు త్వరలో పనులు ప్రారంభమ య్యే అవకాశాలు ఉన్నాయి. శంకుస్థాపన కార్యక్రమాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా ఉప ముఖ్య మంత్రి, ఇంధనశాఖ మంత్రి భట్టి విక్రమార్క చేతుల మీదుగా చేసే అవకాశాలు ఉన్నాయి. ఈ మేరకు పను లకు శంకుస్థాపన చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి 2024 మార్చి 12న హైద్రాబాద్లో ప్రకటించారు. అగ్రిమెంట్ పూర్తయి ఇప్పటికే దాదాపు రెండేళ్లు పూర్త యినందున, ఇప్పటికైనా త్వరితగతిన పనులు ప్రారం భించేందుకు చర్యలు తీసుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది.