Share News

పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి

ABN , Publish Date - Jan 21 , 2026 | 11:26 PM

గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సై నికుల్లా పని చేయాలని బీజేపీ జి ల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌ రావు అన్నారు.

పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి
బూత్‌ కమిటీ సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌ రావు

- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌ రావు

అచ్చంపేటటౌన్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి) : గ్రామాల్లో పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు సై నికుల్లా పని చేయాలని బీజేపీ జి ల్లా అధ్యక్షుడు వేముల నరేందర్‌ రావు అన్నారు. బుధవారం మం డల పరిధిలోని హాజీపూర్‌ గ్రామం లో మండల అధ్యక్షురాలు కాట్రావత్‌ జ్యోతి అ ధ్యక్షతన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పార్టీ పునాది బూత్‌స్థాయిలోనే ఉంటుందని, బూత్‌ కమిటీలు పటిష్టంగా ఉన్నప్పుడే బీజేపీ పార్టీ బలోపేతం అవుతుం దన్నారు. ప్రతీ కార్య కర్త సమన్వయంతో పనిచేసి పార్టీని క్షేత్రస్థాయి లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధానకార్యదర్శి నాగేందర్‌, నాయకులు రేణ య్య, ఆంజనేయులు, అఖిల్‌రెడ్డి, కాశన్న, పత్యా నాయక్‌, రవీందర్‌, శేఖర్‌, శ్రీనివాస్‌, రమేష్‌, బాలస్వామి పాల్గొన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 11:26 PM