Share News

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి

ABN , Publish Date - Aug 29 , 2026 | 11:34 PM

ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగ వంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అ న్నారు. శనివారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు.

ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగవంతం చేయాలి
వీడియోకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి) : ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగ వంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్‌రెడ్డి అ న్నారు. శనివారం హైద్రాబాద్‌ నుంచి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆ యన మాట్లాడుతూ నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలని తెలిపారు. నోటీసుల పంపిణీ ప్ర క్రియను వేగవంతం చేసి పెండిం గ్‌లో ఉన్న అన్ని నోటీసులను సంబంధిత వ్యక్తులకు తప్పనిస రిగా అందజేయాలని తెలిపారు. అనామలీస్‌ నో మ్యాపింగ్‌ జాబి తాను గుర్తింపు పొందిన రాజకీ య పార్టీల ఏజెంట్లకు అందుబా టులో ఉంచాలని, సంబంధిత వ్య క్తులు క్లైయిమ్‌ అభ్యంతరాల సం దర్భంగా సమర్పించాలని పత్రా లు, ఆధారాలపై స్ప్టమైన అవగా హన కల్పించేందుకు ప్రచారం చే యాలన్నారు. కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ మాట్లాడుతూ జిల్లాలో అ నామోలిస్‌, మ్యాపింగ్‌ కానీ ఓట ర్లకు సంబంధించి 1,70,967 నోటీ సులు జనరేట్‌ చేయబడి 32,183 నోటీసులు జారీ చేసి యాప్‌లో వివరాలు నవీకరించామన్నారు. 394 నోటీసుల హియరింగ్‌ ప్ర క్రియ పూర్తి చేసి పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, కార్పోరేషన్‌ కమీషనర్‌ అన్వేష్‌, తహసీల్దార్‌లు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 11:34 PM