వృద్ధుల సమస్యలు తెలియజేయాలి
ABN , Publish Date - Jan 17 , 2026 | 11:30 PM
కొల్లాపూర్ నియో జకవర్గ కేంద్రంలో విశ్వశాంతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని మం డల న్యాయ సేవాధికారర సంస్థ కొల్లాపూర్ కార్యదర్శి, జూనియర్ సివిల్ న్యాయాధికారి దమ్ము ఉప నిషధ్వాని, రెండవ అదనపు జూ నియర్ సివిల్ న్యాయాధికారి శర ణ్య ఆకస్మిక తనిఖీ చేశారు
- ప్రధాన న్యాయాధికారి దమ్ము ఉపనిషధ్వాని
కొల్లాపూర్, జనవరి 17 (ఆంధ్రజ్యోతి) : కొల్లాపూర్ నియో జకవర్గ కేంద్రంలో విశ్వశాంతి వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో ని ర్వహిస్తున్న వృద్ధాశ్రమాన్ని మం డల న్యాయ సేవాధికారర సంస్థ కొల్లాపూర్ కార్యదర్శి, జూనియర్ సివిల్ న్యాయాధికారి దమ్ము ఉప నిషధ్వాని, రెండవ అదనపు జూ నియర్ సివిల్ న్యాయాధికారి శర ణ్య ఆకస్మిక తనిఖీ చేశారు. వృద్దు లతో మాట్లాడుతూ వారి యోగక్షేమాలు తెలు సుకున్నారు. న్యాయ సేవలో భాగంగా వృద్ధాశ్ర మంలో పొందుతున్న వారికి ఏమైనా సమస్య లు ఉంటే పారా లీగల్ వలంటరీలకు తెల పాలని సూచించారు. వారి ద్వారా తమ దృష్టికి తీసుకొస్తే వాటి పరిష్కారానికి కృషి చేస్తామని న్యాయాధికారులు వృద్ధులకు తెలియ జేశారు. లోక్ అదాలత్ సిబ్బంది కేశవ్ కుమార్, పారా లీగల్ వలంటరీ మధుసూదన్, వృద్ధులకు బిస్కెట్ల పంపిణీ చేశారు.