మహిళల అభ్యున్నతే కేంద్ర ప్రభుత్వ ధ్యేయం
ABN , Publish Date - Jun 20 , 2026 | 11:25 PM
మహిళల అభ్యున్నతే ధ్యేయంగా కేం ద్ర ప్రభుత్వం పని చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్రావు అన్నారు.
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు నరేందర్ రావు
అచ్చంపేటటౌన్, జూన్ 20 (ఆంధ్రజ్యో తి) : మహిళల అభ్యున్నతే ధ్యేయంగా కేం ద్ర ప్రభుత్వం పని చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్రావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 12 సంవత్స రాల సుపరిపాలన, అభివృద్ధి కార్యక్రమం లో శనివారం పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నారీ శక్తి ఫుడ్ఫెస్టివల్ సంబురాలను మహి ళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు బల్మూరి జానకి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆయన మాట్లాడు తూ మహిళా సాధికారత, స్వయం ఆధారిత జీ వనం, ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా కేంద్రంలోని మోదీ నాయకత్వంలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు మంగ్యానాయక్, రేణయ్య, పట్టణ అధ్యక్షుడు శ్రీను, మండల అధ్యక్షురాలు జ్యోతి, నాయకులు శంకర్ మాదిగ, శివ చంద్ర, రవీం దర్ నాయకులు పాల్గొన్నారు.