రాష్ట్ర అభివృద్ధిలో కేంద్ర ప్రభుత్వం కీలకపాత్ర
ABN , Publish Date - May 07 , 2026 | 11:23 PM
రాష్ట్ర అభివృద్ధి లో కేంద్ర ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తుందని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు వేముల నరేందర్రావు అ న్నారు.
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు వేముల నరేందర్ రావు
అచ్చంపేటటౌన్, మే 7 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్ర అభివృద్ధి లో కేంద్ర ప్రభుత్వం కీలకపాత్ర పోషిస్తుందని బీజేపీ జిల్లా అ ధ్యక్షుడు వేముల నరేందర్రావు అ న్నారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు దాదాపు రూ.10లక్షల కోట్లకు పైగా రా ష్ట్రానికి కేంద్రం నిధులు వచ్చాయని పేర్కొన్నా రు. ఈ నెల10న హైదరాబాద్లో నిర్వ హించే బహిరంగసభ సన్నాహక సమావేశం గురువా రం పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే గువ్వల బా లరాజు నివాసంలో ఏర్పాటు చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 10న రా ష్ట్రానికి ప్రధానమంత్రి వస్తున్నారని తెలిపారు. సుమారు రూ.7,823 కోట్లకుపైగా వివిధ అభి వృద్ధి పనులను ప్రారంభిస్తున్నారన్నారు. అనం తరం పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే భారీ బహి రంగ సభకు కార్యకర్తలు, అభిమానులు, నాయ కులు తరలిరావాలని కోరారు. నాయకులు ఆం జనేయులు, అఖిల్రెడ్డి, కృష్ణ, దేవేందర్రెడ్డి, ర వీందర్, చౌహాన్, సతీష్ పాల్గొన్నారు.